ప్రస్తుతం తెలుగు టెవివిజన్ లో మోస్ట్ పాపులర్ ప్రోగ్రామ్ ఏందంటే వెంటనే చెబుతారు జబర్ధస్త్ కామెడీ షో.  ఈ ప్రోగ్రామ్ లో వచ్చిన వారు ఇప్పుడు వెండి తెరపై కమెడియన్లుగా రాణిస్తున్నారు.  ఆరు సంవత్సరాల క్రితం జబర్ధస్త్ మొదలై ఇప్పటికే అదే క్రేజ్ తో రన్ అవుతుంది.  జబర్ధస్త్  లో నటించిన నటులు ఇప్పుడు వెండి తెరపై పాపులర్ కమెడియన్లు గా మారుతున్నారు.  జబర్ధస్త్  ద్వారా వచ్చిన ధన్ రాజ్, వేణు, తాగుబోతు రమేష్, చమ్మక్ చంద్ర లాంటి వారు కమెడియన్లుగా రాణిస్తుంటే..షకలక శంకర్ ఏకంగా హీరోగానే వస్తున్నారు.  ఈ మద్య ఇస్మార్ట్ శంకర్ మూవీలో హీరో రామ్ స్నేహితుడిగా గెటప్ శీను మంచి పాత్రలో కనిపించారు.  ఇలా ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు జబర్ధస్త్  ప్రాగ్రామ్ వల్ల వెలుగులోకి వస్తున్నారు.


ప్రస్తుతం జబర్ధస్త్ తో పాపులర్ అయిన అప్పారావు కూడా సినిమాల్లో కామెడీ పాత్రల్లో నటిస్తున్నారు.  ఒకప్పుడు ఈయన నటించిన పాత్రలకు పెద్దగా గుర్తింపు రాకపోవడం గమనార్షం.  తాజాగా అప్పారావు.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నేను జబర్ధస్త్ లో భాగస్వామిని అయినందుకు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటానని అన్నారు.  మొదట్లో తనపై చాలా మంది విముఖత చూపినా తన స్కిట్స్ చాలా మంది నచ్చడంతో తనకు కూడా అభిమానులు పెరిగారని అన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు .

‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ సినిమా చేస్తున్నప్పుడు నేను సంపూర్నేష్ బాబుకి అసిస్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఆ సందర్భంగా సంపూర్ణేష్ బాబు తనకు ఓ సీక్రెట్ చేప్పారని..నిజానికి హృదయకాలేయం అనే సినిమాతో చేయాలనీ అనుకున్నారు.  అయితే ఆ మూవీ కొత్త నటులతో ఇంట్రడ్యూస్ చేస్తేనే బాగుంటుందని తనకు తీసుకున్నట్లు తెలిపారని అన్నారు. లేకపోతే అ సినిమా మీతోనే చేసేవారని అప్పారావు చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: