భారీ యాక్షన్ థిల్లర్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా  తెరకెక్కుతున్న "సాహో" విడుదల కోసం ప్రభాస్ ఫ్యాన్స్  ఎంతగానో  ఎదుచూస్తున్నారు.  నిజానికి ఎప్పుడో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నా  అలా ఏదొక కారణం చేత వాయిదా పడుతూ...   చివరిగా 2019 ఆగష్టు 30న అని చెప్పి ఒక డేట్ ను చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్  ఫైనల్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి  చేస్తోన్న ప్రమోషన్స్ పెద్దగా ఏమి ఇంపార్ట్ క్రియేట్ చెయ్యలేకపోతున్నాయి.  దీనికి ఒక కారణం కూడా లేకపోలేదు. అప్డేట్స్ కావాలి, అప్డేట్స్ కావాలి అని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేసేసరికి ఎలాగో సినిమా కూడా పూర్తి కావస్తుండడంతో చిత్ర యూనిట్ ఏదొక అప్డేట్ ఇస్తున్నారు. దాంతో అవి సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వట్లేదు.  మొత్తానికి వీటి వల్ల  సినిమా పై  అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా రీసెంట్ గా  స్టన్నింగ్ యాక్షన్ ప్యాక్ డ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ స్టన్నింగ్ యాక్షన్ పోస్టర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్స్ లో కొనసాగింది. అయినా ఎదో హోలీవడ్ సినిమాకి కాపీలా అనిపించింది. 


అలాగే  ఇప్పటికే మూవీలోని ప్రధాన విలన్ నీల్ నితిన్ ముఖేష్ లుక్ ని విడుదల చేస్తే అది అలాగే ఉంది.  నిన్న మరో విలన్ అరుణ్ విజయ్ లుక్ ని విడుదల చేశారు. దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. అయితే  ప్రతి విలన్ ని పరిచయం చేస్తున్న పోస్టర్ లో డీప్ మీనింగ్ తో ఓ కొటేషన్ పెడుతున్నారు. నీల్ నితిన్ పోస్టర్ లో "అంతం అన్నిటికీ సమాధానం కాదు" (ది ఎండ్ డస్ నాట్ ఆన్సర్ ఎవ్రీథింగ్)అనే  సీరియస్ లైన్ ఉండగా,   నిన్న విడుదల చేసిన అరుణ్ విజయ్ పోస్టర్ లో యుద్దానికి ఆహ్వానం అవసరం లేదు (బ్లడ్ డస్ నాట్ నీడ్ బ్లడీ ఇన్విటేషన్) అనే  డేంజరస్ కోట్ ఉండటం గమనార్హం. ఈ రోజు  విలన్ పాత్ర చేస్తున్న చుంకీ పాండే లుక్ ని రివీల్ చేశారు.  మిగతా ఇద్దరిలాగే ఈ విలన్ కి "చితి నుండి లేచొచ్చాడు" (రైజన్ ప్రమ్ యాషెస్) అనే ఓ ఇంట్రెస్టింగ్ లైన్ యాడ్ చేశారు.  మొత్తానికి పోస్టర్స్ ఆకట్టుకోకపోయినా..   కొటేషన్ లు ఆకట్టుకుంటున్నాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: