బిగ్ బాస్ లో రోజు రోజుకీ గొడవలు పెరుగుతున్నాయి. టాస్క్ లో భాగంగా నిన్న జరిగిన గొడవలని చూస్తే శ్రీముఖిని కావాలనే టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది.  ఛాన్స్ వచ్చింది కదా అని ఆమెని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు. అయితే నిధిని దొంగిలించడానికి ఉన్న ఒకే ఒక మార్గం గ్లాస్ ని పగలకొట్టడం... దాన్ని డంబెల్ తో పగల కొట్టి నిధిని దొంగిలించాలని ప్లాన్ వేసారు. కానీ రవిక్రిష్ణ ఆవేశంతో చేతితో పగల కొట్టడంతో చేయికి గాయం అయింది.


దీంతో ఇంట్లోని సభ్యులందరూ షాక్ కి గురయ్యారు. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే దీన్నే అదునుగా తీసుకుని శ్రీముఖి ని టార్గెట్ చేసారు. వితికా, రాహుల్ లు శ్రీముఖే పగలకొట్టమని చెప్పిందంటూ  ఆమె పై విరుచుకు పడటం కొంత వరకు కరెక్టే అనిపించినా, జాగ్రత్తగా గమనిస్తే దానిలో శ్రీముఖి చేసింది ఏమీ లేదని అర్థం అవుతుంది.


ఎందుకంటే డంబెల్ తో పగలకొట్టమని ఆమె చెప్పడం తప్పు కాదని, రవిక్రిష్ణ చేతితో పగలకొట్టి తప్పు చేసాడని దానికి శ్రీముఖి బాధ్యురాలిని చేయడం భావ్యం కాదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ వితికా, రాహుల్, పునర్నవి లు కలిసి కావాలనే శ్రీముఖిని టార్గెట్ చేసారని అంటున్నారు. అంతమంది ఒకే సారి తన మీద అరుస్తుంటే ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఊరికే ఉందని తెలుస్తుంది. 


ఈ విషయంలో రాహుల్ కొంత అతిగా ప్రవర్తించాడు. ఫాల్తుది అంటూ శ్రీముఖిని తిట్టడం అతని లూజ్ టంగ్ ని అర్థం చేసుకోవచ్చు. ఏ విషయంలోనైనా తొందరగా రియాక్ట్ అయ్యే శ్రీముఖి సైలెంట్ గా ఉండటం కొంత ఆశ్చర్యంగా అనిపించింది.  అయితే పునర్నవి, వితికా, రాహుల్ లు కలిసి శ్రీముఖిని కార్నర్ చేసారనే విషయం తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: