తల  అజిత్  నటించిన  తాజా చిత్రం 'నెర్కొండ పరవాయ్' ఈ రోజు తమిళనాడు వ్యాప్తంగా   భారీ  స్థాయిలో  విడుదలైయింది. ఎర్లీ మార్నింగ్ షోస్ నుండి వస్తున్న రిపోర్ట్స్  ప్రకారం సినిమా అదిరిపోయిందని టాక్ వినిపిస్తుంది.  విమర్శకులను సైతం మెప్పించిన ఈ చిత్రం  ఏకంగా 3.5 , 4 రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది.   ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ అదిరిపోయిందని  ముఖ్యంగా  కోర్టు సీన్ లో అజిత్  యాక్టింగ్ , డైలాగ్స్ ,ఇంటర్వెల్  ఎపిసోడ్  సూపర్ అనే టాక్ వినిపిస్తుంది.  అలాగే  యువన్ శంకర్ రాజా  నేపథ్య సంగీతం  సినిమాకు  మరో ప్రధాన  ఆకర్షణ గా నిలిచిందట. 
 
బిగ్ బి అమితాబ్ బచ్చన్ , తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్  సూపర్ హిట్ మూవీ  పింక్ కు రీమేక్ గా  తెరకెక్కింది ఈ చిత్రం.   'ఖాకి'  ఫేమ్ వినోత్ డైరెక్ట్ చేసిన ఈ ఛితంలో  శ్రద్ద శ్రీనాథ్ , అభిరామి , ఆండ్రియా కీలక పాత్రల్లో నటించారు.  సందేశాత్మక చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్  నిర్మించారు.  కాగా ఈ ఏడాది ప్రారంభం లో విశ్వాసం తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న అజిత్ ఇప్పుడు ఈ తాజా చిత్రంతో మరో విజయాన్ని  సొంతం చేసుకున్నాడు. 



ఇక  పింక్ ను  తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ రీమేక్ ను నిర్మించనుండగా  నందమూరి బాలకృష్ణ హీరోగా నటించనున్నాడట. ఇందుకోసం  'లాయర్ సాబ్'  అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించాడట దిల్ రాజు.  అయితే ఈ రీమేక్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలుబడలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: