తల అజిత్ నటించిన తాజా చిత్రం 'నెర్కొండ పరవాయ్' ఈ రోజు తమిళనాడు వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైయింది. ఎర్లీ మార్నింగ్ షోస్ నుండి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సినిమా అదిరిపోయిందని టాక్ వినిపిస్తుంది. విమర్శకులను సైతం మెప్పించిన ఈ చిత్రం ఏకంగా 3.5 , 4 రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది. ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ అదిరిపోయిందని ముఖ్యంగా కోర్టు సీన్ లో అజిత్ యాక్టింగ్ , డైలాగ్స్ ,ఇంటర్వెల్ ఎపిసోడ్ సూపర్ అనే టాక్ వినిపిస్తుంది. అలాగే యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ గా నిలిచిందట.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ , తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం. 'ఖాకి' ఫేమ్ వినోత్ డైరెక్ట్ చేసిన ఈ ఛితంలో శ్రద్ద శ్రీనాథ్ , అభిరామి , ఆండ్రియా కీలక పాత్రల్లో నటించారు. సందేశాత్మక చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించారు. కాగా ఈ ఏడాది ప్రారంభం లో విశ్వాసం తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న అజిత్ ఇప్పుడు ఈ తాజా చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇక పింక్ ను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ రీమేక్ ను నిర్మించనుండగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించనున్నాడట. ఇందుకోసం 'లాయర్ సాబ్' అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించాడట దిల్ రాజు. అయితే ఈ రీమేక్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలుబడలేదు.