కంగనా రనౌత్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు.  ఒక సినిమా చేసేందుకు అంత సామాన్యంగా కంగనా ఒప్పుకోదు. అందరి హీరోయిన్లలా గ్లామర్ పాత్రలు చేసి సరిపెట్టుకోదు.  సినిమా చేయాలి అంటే ఆ సినిమాలో తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలి.  పాత్రను తీర్చిదిద్దే విధానం ఆమెకు నచ్చాలి.  అప్పుడే సినిమా ఒప్పుకుంటుంది.  అందుకే ఆమెను అందరు బాలీవుడ్ క్వీన్ అంటారు.  మాణికర్ణక సినిమా విషయంలో తీసిన విధానం నచ్చక డైరెక్టర్ క్రిష్ ను పక్కన పెట్టించి తానే సొంతంగా దర్శకత్వం వహించింది.  



ఇటీవలే రిలీజైన జడ్జిమెంటల్ హై క్యా సినిమా విషయంలో కూడా దాదాపు అలాగే జరిగింది. కాకపోతే ఈ మూవీలో ఆమె దర్శకుడిని పక్కన పెట్టలేదు.  కొన్ని సీన్స్ కు మాత్రం ఆమె దర్శకత్వం వహించింది అన్నది సత్యం.  అలాంటి ఈ హీరోయిన్ ఇప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తలైవి అమ్మ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటించబోతున్నది.  తలైవి సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  



ఈ సినిమాకు వర్క్ చేయడం కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ వచ్చారు.  ఈ టెక్నిషియన్స్ సారథ్యంలో కంగనా మేకప్ టెస్ట్ జరుగుతున్నది.  జయలలిత కెరీర్లో ఎంజీఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది.  తలైవి సినిమాలో ఎంజీఆర్ పాత్ర కీలకం.  ఈ పాత్రకోసం అనేకమందిని పరిశీలించినా.. చివరకు ఆ అవకాశం అరవింద్ స్వామికి దక్కినట్టు తెలుస్తోంది.  అరవింద్ స్వామీ ప్రస్తుతం తమిళంలో విలన్ రోల్స్ చేస్తూ బిజీ అయ్యాడు.  తనీఒరువన్ సినిమా తరువాత అరవింద్ స్వామీ బిజీ అయ్యారు.  కంగనా, అరవింద్ స్వామిది కొత్త కాంబినేషన్.  ఇద్దరు ఎలా నటిస్తారో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: