బాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరు అక్షయ్ కుమార్. సినిమాల్లోకి రాకముందు అక్షయ్ కుమార్ హోటల్ లో చెఫ్ గా పనిచేశారు. కష్టం అంటే ఏంటో తెలుసు కాబట్టి ప్రతి రూపాయిని జాగ్రత్త చేస్తూ వచ్చారు. అప్పుడు తీసుకున్న ఆ జాగ్రత్తలే ఇప్పుడు ఆయన ఈస్థాయికి రావడానికి కారణంగా మారాయి. సినిమాల్లో నటించే ప్రతి క్షణం బాగా రావాలని చూస్తారు. ఎందుకంటే సినిమా బాగా వచ్చి హిట్ అయితే మరో సినిమా వస్తుంది.
ఎంత స్టార్ అయినా కావొచ్చు. కానీ, ఒక్కాసారి డబ్బు పొతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎన్నో కష్ఠాలు పడాల్సి వస్తుంది. నష్టాలు మూటకట్టుకోవాల్సి వస్తుంది. అందుకే అక్షయ్ సినిమాల్లో నటిస్తున్నాడుగాని, సినిమా ప్రొడక్షన్స్ రంగంలోకి దిగలేదు. ఇదిలా ఉంటె ఈ కిలాడీ హీరో 2018-19 వ సంవత్సరానికి గాను ఫోర్బ్స్ జాబితాలో అత్యధిక ధనవంతుల లిస్ట్ లో చేరిపోయాడు.
దీనిపై అక్షయ్ కుమార్ చాలాసార్లు స్పందించారు. తనకు పనిచేసుకుంటూ పోవడమే తెలుసునని.. ఇంత సంపాదించాను అనే సంగతి ఇప్పటి వరకు తెలియదని అన్నాడు. ప్రస్తుతం మిసహం మంగళ్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. 2013 వ సంవత్సరంలో ఇండియా మార్స్ మీదకు ఉపగ్రహాన్ని పంపింది. దానినేపథ్యంతో సినిమా చేశారు. అక్షయ్ కుమార్ తో పాటు, విద్యాబాలన్, నిత్యామీనన్, సోనాక్షి సిన్హా, తాప్సి తదితరులు ఈ మూవీ నటించారు.
ఈ సినిమా కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తుంది. అక్షయ్ కుమార్ దేశభక్తితో కూడిన సినిమాలు ఇటీవల కాలంలో ఎక్కువగా చేస్తున్నారు. దేశంలోని సమస్యలను ప్రస్తావించే సినిమాలు చేసేందుకు అయన ఆసక్తి చూపిస్తుండటం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.