భరత్ అనే నేను, మహర్షి రెండు సినిమాలు వరసగా హిట్ కావడంతో మహేష్ నెక్స్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరూ సినిమాకు హైప్ వచ్చింది. ఈ సినిమా సీరియస్ గా సాగుతూనే పక్కా ఎంటర్టైనర్ గా ఉండబోతుందని అంటున్నారు. ఎఫ్ 2 తరువాత అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా ఇది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది. ఈ మూవీ తరువాత మహేష్ చేయబోయే సినిమా ఏంటి అన్నది అందరిలోనూ సందేహాలు కలుగుతున్నాయి.
మహేష్ కోసం ముగ్గురు దర్శకులు రెడీ గా ఉన్నారు. మహేష్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో పరశురామ్ ప్రయత్నిస్తున్నాడు. కథ, స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పరశురామ్ తో సినిమాతో చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఎటొచ్చి మహేష్ బాబు ఒప్పుకోవాలి. గీతగోవిందం తరువాత మహేష్ తో చేయాలని పట్టుదలగా ఉన్నాడు పరశురామ్.
మరోవైపు అర్జున్ రెడ్డి హిట్ తరువాత మహేష్ తో సినిమా చేయాలి అనుకున్నా కుదరలేదు. అందుకే హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ చేశారు. అక్కడ భారీ హిట్టైంది. అంతేకాదు, ఈ మూవీ బాలీవుడ్ లో ఈ ఏడాది హయ్యస్ట్ కలెక్షన్ జాబితాలో నిలిచింది. ఈ దర్శకుడు కూడా కథను సిద్ధం చేసుకొని మహేష్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మహేష్ ఊ అంటే కథ చెప్పేందుకు సిద్ధం. అర్జున్ రెడ్డితో తనను తాను నిరూపించుకున్నాడు కాబట్టి సినిమా చేసే అవకాశం ఉన్నది. సందీప్ తో సినిమా చేసేందుకు గీతా ఆర్ట్స్ సిద్ధంగా ఉన్నది.
ఇదిలా ఉంటె, మహేష్ ఎప్పటి నుంచో రాజమౌళితో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటి వరకు కుదర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మహేష్ రాజమౌళితో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతున్నది. మహేష్ కూడా రాజమౌళితో సినిమా చేస్తానని చెప్పాడు. 2020 జులై 30 రాజమౌళి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తరువాత కథ మొత్తం రెడీ కావడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. అంటే 2021 లో రాజమౌళి సినిమా ప్రారంభం అవుతుంది. సో, రాజమౌళి సినిమా ప్రారంభం అయ్యేలోపు మహేష్ బాబు ఆ ఇద్దరు దర్శకుల్లో ఎవరో ఒకరితో సినిమా ఫినిష్ చెయ్యొచ్చు. లేదంటే ఇద్దరి సినిమాలు ఫినిష్ చెయ్యొచ్చు. మరి మహేష్ మదిలో ఎలాంటి ఆలోచన ఉన్నదో చూడాలి.