శింబు కి కోలీవుడ్ లో మంచి ఫాలోయింగే వుంది ఆయన సినిమాలు యావరేజ్ గా ఆడిన సరే నిర్మాతలకు మంచి లాభాలే వస్తాయి. దాంతో శింబు కూడా సినిమా 3నుండి 4కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడు. అయితే మనాడు నిర్మాత సురేష్ , శింబు కు అంత ఇవ్వలేనని ఈసినిమా ను అప్ కమింగ్ హీరో తో చేద్దామని ఫిక్స్ అయ్యాడట దాంతో ఈ సినిమా నుండి శింబు ను తప్పించారు.
తాజాగా వెంకట్ ప్రభు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆర్థిక సమస్యలు వల్ల నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నా తమ్ముడు శింబు తో ఈసినిమా చేయలేకపోతున్నాను కానీ తప్పకుండా భవిష్యత్తులో శింబు తో సినిమా చేస్తానని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇక పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం లో మలయాళీ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించనుంది. మరో హీరోగా ఎవరిని తీసుకుంటారో చూడాలి. కాగా వెంకట్ ప్రభు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కాజల్ తో ఓ వెబ్ సిరీస్ ను రూపొందిచాడనికి సన్నాహాలు చేస్తున్నాడు.