కోలీవుడ్ యంగ్ హీరో  శింబు  తో 'మానాడు' అనే  చిత్రాన్ని తెరకెక్కించనున్నానని  ఏడాది క్రితమే ప్రకటించాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. వి హౌస్ ప్రొడక్షన్ బ్యానేర్ ఫై సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు  రెడీ అయ్యాడు.   ఇక సినిమాకు  సంబంధించిన పోస్టర్ ను కూడా గత ఏడాదే విడుదలచేశారు.  అయితే సినిమా మాత్రం ఇంతవరకు  సెట్స్ మీదకు రాలేదు. దాంతో ఈసినిమా క్యాన్సల్ అయ్యిందని  వార్తలు వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటంటే మానాడు సినిమా నుండి  శింబు ను  తప్పించారు. 


శింబు కి కోలీవుడ్ లో  మంచి ఫాలోయింగే వుంది ఆయన సినిమాలు యావరేజ్ గా ఆడిన సరే నిర్మాతలకు   మంచి లాభాలే వస్తాయి. దాంతో శింబు కూడా సినిమా 3నుండి 4కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడు. అయితే  మనాడు నిర్మాత సురేష్  , శింబు కు అంత ఇవ్వలేనని ఈసినిమా ను అప్ కమింగ్ హీరో తో చేద్దామని ఫిక్స్ అయ్యాడట దాంతో ఈ సినిమా నుండి శింబు ను తప్పించారు.  


తాజాగా  వెంకట్ ప్రభు కూడా  ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ..  ఆర్థిక సమస్యలు వల్ల నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నా తమ్ముడు  శింబు తో ఈసినిమా చేయలేకపోతున్నాను కానీ తప్పకుండా భవిష్యత్తులో శింబు తో సినిమా చేస్తానని  సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.  ఇక పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం లో మలయాళీ బ్యూటీ  కళ్యాణి ప్రియదర్శన్  హీరోయిన్ గా నటించనుంది. మరో హీరోగా ఎవరిని తీసుకుంటారో చూడాలి. కాగా వెంకట్ ప్రభు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కాజల్ తో ఓ వెబ్ సిరీస్ ను రూపొందిచాడనికి సన్నాహాలు చేస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: