ఈ మద్య సినిమాలు మూస పద్దతిలో కాకుండా వెరైటీ కాన్సెప్ట్ లతో రావడం శుభపరిణామంగా చెప్పుకోవొచ్చు. ఒకప్పుడు హర్రర్ సినిమాలంటే భయంతో థియేటర్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు హర్రర్ సినిమాల్లో కావలసినంత కామెడీ ఉండటంతో చిన్న పిల్లలు సైతం అదురూ బెదురూ లేకుండా థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో భారీగా ఖర్చు పెడుతూ సినిమాల వ్యాల్యూ కూడా పెంచుతున్నారు. రాజమౌళి తీసిన జానపద సినిమా బాహుబలి ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటి చెప్పింది.
ప్రస్తుతం భారత దేశంలో ఎక్కడ చూసినా ఆర్టికల్ 370, 35Aన గురించే చర్చలు జరుగుతున్నాయి. కొంత కాలంగా కాశ్మీర్ పై జరుగుతున్న రగడ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ సంచలన ప్రకటన చేసిన మరుక్షణంలో భారతీయుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్ని రోజులు కశ్మీర్ ప్రజలు ఏం మిస్ అయ్యారు, అక్కడ పరిపాలన ఏ విధంగా సాగింది అనే దానిపై చర్చలు జరుపుతున్నారు.
ఆ మద్య బాలీవుడ్ లో ఆర్టికల్ 15 అనే మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆర్టికల్ 370 పేరుతో కూడా నిర్మాతలు సినిమా ప్లాన్ చేసేందుకు కసరత్తులు జరుపుతున్నారు. దాదాపు ఇదే అంశంపైనే టాలీవుడ్లో రూపొందుతున్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. సాయికిరణ్ అడివి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు.
సాయికిరణ్ అడివి ఇప్పటికే వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేరింత సినిమాలను తెరకెక్కించారు. ఈ మూవీ ఆర్టికల్ 370 అంశానికి దగ్గరగా ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాలో ఎన్.ఎస్.జి కమెండోగా ఆది కనిపిస్తున్నారు . సాషా ఛెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, మనోజ్ నందం, అబ్బూరి రవి, కృష్ణుడు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, సెప్టెంబర్లో సినిమాను విడుదల చేయడానికి ఫ్లాన్ చేస్తున్నారు.