సినిమాలు తీసేందుకు ఎంత కష్టపడతారో, దాన్ని పైరసీ కాకుండా కూడా అంతే కష్టపడాల్సి వస్తుంది. పైరసీ కాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో ఒకచోట నుండి లీకై సినిమా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. కోట్లకి కోట్లు పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు పైరసీ ద్వారా చాలా నష్టపోతున్నారు. ఈ పైరసీ భూతం చిన్న సినిమాలకే కాదు. పెద్ద సినిమాలను ఇబ్బంది పెడుతుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" విడుదలకు ముందే పైరసీ అయిన విషయం తెలిసిందే.


అయితే తాజాగా తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమాకి కూడా ఈ పైరసీ అంటుకుంది. విడుదలకు ముందే ఆయన తాజా చిత్రంలోని మేజర్ సన్నివేశాలు నెట్లో పెట్టి పరిశ్రమ వర్గాలను షాక్ కి గురిచేశారు.అసలు విషయంలోకి వెళ్తే అజిత్ నటించిన  "నేర్కొండ పార్వై" సినిమా ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తో చిత్ర బృందం షాక్ కి గురైంది.


అసలు సినిమా విడుదలకు ముందే పైరసీ ఎలా అయ్యిందని ఆలోచించగా “నెర్కొండ పార్వై”చిత్రాన్ని సింగపూర్ వేదికగా ఓ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడంతో పాటు, ఈనెల 6న మీడియా ప్రతినిధుల కొరకు చెన్నైలో ఓ షో వేయడం జరిగింది. ఈ రెండు సందర్భాలలోనే కొందరు రహస్యంగా ఈ మూవీని చిత్రించి ఉంటారని కొందరు భావిస్తున్నారు. 


ఐతే లీక్ అయిన వీడియోలు అంత క్వాలిటీగా లేకపోవడం కొంచెం ఉపశమనం కలిగించే అంశం. నిర్మాత బోనీ కపూర్ ఈ విషయంపై సైబర్ పోలీసులకు పిర్యాదు చేశారని సమాచారం. 2016లో అమితాబ్ హీరోగా విడుదలైన హిట్ మూవీ పింక్ కి “నెర్కొండ పార్వై” తమిళ రీమేక్ కాగా ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించగా హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. అమితాబ్ చేసిన లాయర్ పాత్రని ఈ సినిమాలో అజిత్ చేసాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: