మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలామంది ఒక స్థాయి వచ్చాక ఇక తమ క్రేజ్ ను పెంచుకోవడానికి లేడీ ఓరియోంటెడ్ కథలను సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో ఒక్క సినిమా గనక సూపర్ హిట్టయితే హీరోలకు పోటీ పడటమే కాదు రెమ్యునిరేషన్ కూడా కోట్లలో పెరిగిపోతుంది. అందుకే అనుష్క, నయనతార, సమంత..టాలీవుడ్ లో బాగా పాపులర్ అవడమే కాదు హాలీవుడ్ సినిమ ఛాన్సులు దక్కించుకుంటున్నారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ విషయానికొస్తే టాలీవుడ్‌, బాలీవుడ్ అని లేకుండా బిజిబిజీగా ఉంటోంది. టాలీవుడ్ జూనియర్, సీనియర్లతో ఇప్పటికే పలు సినిమాలు చేసింది. అయితే రకుల్‌కు ఇంకా ఒక కోరిక మాత్రం అలాగే మిగిలిపోయిందట. అనుష్క, సమంత లేడీ ఓరియెంటేడ్ కథలతో ప్రేక్షకులకు ముందుకొచ్చి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. వీళ్ళలాగే రకుల్ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని ఉందని  తన మనసులోని మాటను వెల్లడించింది.

ఇక లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించాలని ఆఫర్ వచ్చినప్పటికీ రకుల్ కు ఆ సత్తాలేక చేయలేకపోయిందని రీసెంట్‌గా ఫిల్మ్ నగర్‌లో పుకార్లు బాగానే వచ్చాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై రకుల్ క్లారిటీ డీసెంట్‌గా ఇచ్చుకుంది. ఓ వైపు సీనియర్ హీరోలతో చేస్తూనే.. మరో వైపు యంగ్ హీరోలతోను చేస్తున్నానని అందులో భాగంగానే హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతోను..తెలుగులో నితిన్ తోను సినిమా చేస్తున్నానని మీడియాకు వివరించింది.

అయితే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని తనకూ వుంది.. కానీ మంచి మంచి కథలు, కనీసం పర్లేదు చేసేద్దాం అనిపించే కథలు తన దగ్గరికి రాలేదని రకుల్ చెబుతోంది. నిజంగా అలాంటి కథ వస్తే, నాకు నచ్చితే కచ్చితంగా చేస్తానని చెప్పడంతో రకుల్ ఏం కోరుకుంటుందో అర్థమైపోయింది. ఇక నాగార్జున, రకుల్ ప్రీత్, సమంత, కీర్తి సురేష్ నటీనటులుగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన 'మన్మథుడు 2' ఆగస్ట్ 09న విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.  ఇక శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు-2 లోను రకుల్ నటిస్తోంది. కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్‌గా నటిస్తుండగా రకుల్ సిద్దర్థ్ కు జంటగా నటించబోతుందని కోలీవుడ్ మీడియా సమాచారం. కాగా ఈ సినిమా తమిళ్, తెలుగులో రిలీజ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: