బుల్లి తెర నుంచి వెండి తెరకు ప‌రిచ‌య‌మైన తార అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. జ‌బ‌ర్ధ‌స్త్ షో తో మంచి క్రేజ్‌ను సంపాదించిన ఈ భామ నిధానంగా సినిమాల్లో న‌టించ‌డం ప్రారంభించింది. దాంతో ఒక‌దానివెంట ఒక‌టి అవ‌కాశాలు రావ‌డం మొద‌ల‌య్యాయి. అక్క‌డి నుంచి కొన్ని చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషింయ‌డ‌మేకాక లీడ్‌రోల్ కూడా న‌టిస్తుంది అన‌సూయ‌. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో  ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “కథనం”. క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సందర్భంగా అనసూయ మీడియాతో ముచ్చ‌టించారు....


లేడీ ఓరియెంటెడ్ సినిమాలో లీడ్ రోల్ లో చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. నేను ఎంబీఏ చదివి జాబ్ చేస్తున్నప్పుడు పెళ్లి కుదరడంతో ఉద్యోగానికి బ్రేక్ ఇచ్చి ఖాళీగా ఉన్న సమయంలో ఒక యాడ్ చేశాను.  ఆలా అనుకోకుండానే ఇండస్ట్రీకి వచ్చాను.ఈ పాత్ర‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు నిజానికి నేను అంతగా ఎగ్జైట్ కాలేదు. ఎందుకంటే ‘రంగస్థలం’ చిత్రం తరువాత నేను దాదాపు 12 కథల వరకూ విన్నాను. అందులో కథనం స్క్రిప్ట్ నచ్చడంతో దీనికి ఒప్పుకోవడం జరిగింది. ఇందులో ఒక‌ అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర‌లో న‌టించాను. తాను రాసుకున్న ఒక స్క్రిప్ట్ ప్రకారమే సినిమాలో మర్డర్స్ జరుగుతాయి. ఆ మర్డర్స్ పై జరిగే విచారణ బాగా ఇంట్రస్ట్ గా ఉంటుంది. నాకు వేరే భాష‌ల్లో కూడా చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లో కూడా అవ‌కాశాలు వ‌చ్చాయి. నేను ఉద్యోగం చేసే రోజుల్లోనే నాకు హీరోయిన్‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి. 
 
ఈ సినిమాలో మెయిన్ లీడ్ నేనే కావ‌డంతో  ఎక్కువ‌గా ప్రమోషన్స్ చేసే ప్రయత్నం చేశాను. ప్రేక్షకులు థియేటర్ వచ్చేవరికే.. సినిమా బాగుంటేనే హిట్ అవుతుంది. రాజేష్ నాదెండ్లది ఇది ఫస్ట్ ఫిల్మ్. సినిమా పై తనకు మంచి క్లారిటీ ఉంది. నా కోసమే ఈ సినిమా కథ తాను రాసాడేమో అనిపిస్తోంది. నాగార్జున సినిమాకి పోటీ ఇచ్చేఅంత లేదండి. నాగార్జునగారి సినిమాకి మా సినిమా పోటీనా..? నిజానికి మాది చాలా చిన్న సినిమా. అసలు చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడమే కష్టం. అలాంటి పరిస్థితుల్లో మా సినిమా విడుదలకు రేపు కుదిరింది. అంతేగాని మీరన్నట్లు పోటీ లాంటివి ఏమి లేదు. నా త‌ర్వాత ప్రాజెక్ట్స్ అక్టోబర్ లో మరో సినిమా రిలీజ్ కి సంబంధించి అప్ డేట్ వస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: