టాలీవుడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన బ్లాక్ బస్టర్ మూవీ భరత్ అనే నేనులో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీకి అదే తెలుగులో మొదటి సినిమా. అయితే మొదటి సినిమానే సూపర్ స్టార్ సరసన ఛాన్స్ రావడం, అదీకాక ఆ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో బాలీవుడ్ సహా టాలీవుడ్, కోలీవుడ్ దర్శక, నిర్మాతల కళ్ళు కియారా మీద పడ్డాయి. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆమె వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించడం జరిగింది. 

అయితే అనూహ్యంగా ఆ సినిమా బోల్తా కొట్టడంతో కియారాకు టాలీవుడ్ లో అయితే మళ్ళి ఆఫర్ రాలేదు. ఇటీవల బాలీవుడ్ లో ఆమె షాహిద్ కపూర్ తో కలిసి నటించిన, తెలుగు రీమేక్ కబీర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ ని సాధించడంతో కియారా అక్కడ మంచి ఫామ్ లోకి రావడం జరిగింది. ఇక నేడు కొన్ని కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, కియారా త్వరలో కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. విజయ్ హీరోగా ఆయన కెరీర్ 64వ సినిమా త్వరలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మొదలు కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా దర్శకుడు లోకేష్, కియారాను ఎంపిక చేశారట. 

ఈ మేరకు ఆమెనే తీసుకునేందకు యూనిట్ మొత్తం నిశ్చయించారని, మరొక రెండు రోజుల్లో ముంబై వెళ్ళి ఆమెను ఈ విషయమై సంప్రదిస్తారని అంటున్నారు. వాస్తవానికి ఈ వార్త నేడు పలు కోలీవుడ్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నప్పటికీ, దీనిపై ఆ సినిమా దర్శక నిర్మాతల నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, కియారా రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే మరి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: