రబ్బిట్ మ్యాక్ ఈ పేరు తో  తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ  ఈయన పాడిన పాటలు మాత్రం  వాళ్లను ఫుల్ గా అలరించాయి. మలేషియన్ ర్యాప్ సింగర్ అయిన  రబ్బిట్  ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా  మలేషియా తోపాటు ఆసియా దేశాలైన ఇండియా , సింగపూర్ , శ్రీలంక లో కూడా పాపులర్ అయ్యాడు. ఇక  తమిళ సంగీత దర్శకుఢు యువన్ శంకర్ రాజా  తొలిసారి  సౌత్ సినిమాలో రబ్బిట్ చేత సాంగ్ పాడించాడు. 


ఆ తరువాత బన్నీ నటించిన  'రేసు గుర్రం' సినిమాతో తమన్  మొదటి సారి  రబ్బిట్ తో తెలుగులో పాట పాడించారు.  ఆ సినిమాలో  'స్వీటీ' అనే సాంగ్  ను రబ్బిటే పాడాడు. ఈసాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో  తెలిసిందే. ఇక ఈ సాంగ్ తరువాత రబ్బిట్ తో మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ'  లో  రెండో సారి పాట పాడించాడు తమన్.  ఆ సినిమా లో ఆయన పాడిన 'రియా రియా' అనే సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది.


ఇక ఇప్పుడు అల్లు అర్జున్ 19వ సినిమా కోసం తమన్ , రబ్బిట్ మరోసారి కలిసి పనిచేస్తున్నారు.  ఈసినిమాలో తమన్ , రబ్బిట్ తో ఓ సాంగ్ ను పాడిస్తున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం  కాకినాడ లో  జరుగుతుంది.  త్రివిక్రమ్ శ్రీనివాస్  డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా టబు , నవదీప్ , సుశాంత్  ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హరిక హాసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ లో ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: