బహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో... ప్రస్తుతం చిత్రం షూటింగ్ చివరి దశకు చెరుకుంది. ప్రేక్షకుల కోసం ఇప్పటికే టీజర్ తో పాటు కొన్ని ప్రోమో సాంగ్స్ కూడా విడదల చేశారు. ఇందంతా ఏమిటనుకుంటున్నారా... ప్రభాస్ మారిపోయాడు. అంటే అర్ధం కాలేదా...ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన చిత్రాలకు ఎక్కువగా ప్రమోషన్ చేసేవాడు కాదు.


గతంలో తన సినిమాలు విడుదలవుతున్నపుడు కూడా ఎంత ప్రమోట్ చేయాలో అంతే చేస్తాడు. కొన్ని ఇంటర్వ్యూలు, ఒకట్రెండ్ ప్రెస్ మీట్లు . ఇది ప్రభాస్ వరుస. ప్రభాస్ నటించిన వరల్డ్ బిగెస్ట్ మూవీ అయిన బాహుబలికి కూడా ఎక్కువగాప్రచారం చేయ్యలేదు. కేవలం దర్శకధీరుడు రాజమౌలి పేరు బలంతోనే చిత్రం ప్రపంచ స్థాయి రికార్డులకెక్కింది. దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల్లో చిత్రం నిర్మాణం పూర్తి చేసుకొని విడుదలై భారీ ప్రజాధరణ పొందింది. ఇప్పుడు అదే ప్రభాస్ కు వజ్రాయుధంగా మారింది.ప్రభాస్ తాజా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రంలో ప్రభాస్ తప్ప మిగిలిన వారు ఎవ్వరూ అంతగా ప్రముఖులు కారు.


దర్శకుడు సుజీత్ హైదరాబాద్ వాసీ కావడంతో అతను రెండు తెలుగు రాష్ర్టాలకు ఈ చిత్రంతోనే పేరు సంపాదించుకున్నాడు. సుజీత్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రమోట్ చెయ్యాలంటే ప్రపంచ స్థాయిలో తెలిసిన వ్యక్తి ప్రభాస్ ఒక్కడే. కాబట్టి ఇప్పుడు అతను ప్రమోషన్ చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు. ప్రభాస్ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అంతగా ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదు. ఇప్పుడు ప్రపంచస్థాయిలో తిరగడానికి కారణం ఏమిటంటారా?


ప్రభాస్ ను నమ్ముకోనే వందల కోట్ల ఖర్చుపెట్టి ఈ సినిమాని నిర్మించారు. తాజాగా విడుదలైన సాహో టీజర్, ప్రోమోషనల్ పాటలలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. తన తదుపరి చిత్రాలను నటించాలంటే సాహో విజయవంతం అవ్వాలి. కాబట్టి ప్రభాస్ "సాహో" కోసం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సుడిగాలి పర్యటన వేయనున్నాడు. మెయిన్ నగరాలన్నింటిలో ప్రెస్ మీట్, ఈవెంట్స్ చేస్తాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: