పేట తరువాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే దర్బార్ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు సూపర్ స్టార్ రజినీ కాంత్. అయితే ఈసినిమా తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజీకీయాల్లో బిజీ అవుతారనుకుంటే మరో సినిమాకు సైన్ చేసి షాక్ ఇచ్చాడు రజినీ. డైరెక్టర్ శివ తో తలైవా తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. శౌర్యం , శంఖం , దరువు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివ ఆ తరువాత కోలీవుడ్ లో స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలు చేసి అక్కడ ఫేమస్ అయ్యాడు.
వివేగం తరువాత అజిత్ తో చేసిన విశ్వాసం సూపర్ హిట్ కావడంతో శివకు కోలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. ఇక ఇటీవల రజినీ ని కలిసి శివ కథ వినిపించాడట. రజినీ కి కథ నచ్చడంతో వెంటనే సినిమా కు ఓకే చెప్పాడట. అయితే ఈచిత్రాన్ని ఎవరు నిర్మిస్తారో తెలియాల్సి వుంది. త్వరలోనే శివ -రజినీ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలుబడే అవకాశాలు వున్నాయి. త్వరలోనే శివ -రజినీ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.
ఇక ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న దర్బార్ చిత్రం యొక్క శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ఈచిత్రం నుండి విడుదలైన రజినీ స్టిల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్ నివేతా థామస్ ముఖ్య పాత్రలో కనిపించనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కు విడుదలకానుంది.