సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షో. షో స్టార్ట్ అవ్వక ముందే వరుస వివాదాలతో సంచలనం సృష్టించింది బిగ్ బాస్ సీజన్ 3. అయితే షో స్టార్ట్ అయ్యాక కూడా ముందు నుండి వరుస వివాదాలతో బిగ్ బాస్ హౌస్ మొత్తం వాతావరణం నిండిపోయింది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లో ఇంటి సభ్యులు పక్కా స్ట్రాటజీ లో వేసుకుని గ్రూపుల కడుతూ డబుల్ గేమ్ ఆడుతూ షో నీ రక్తి కట్టిస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ప్రోగ్రాం సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇటువంటి తరుణంలో హాట్ యాంకర్ అనసూయ బిగ్ బాస్ సీజన్ 3   గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.


ఒకపక్క బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న అనసూయ ఇటీవల సిల్వర్ స్క్రీన్ పై కూడా అద్భుతంగా మంచి అవకాశాలు అందుకుంటూ బిజీ లైఫ్ గడుపుతుంది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో తన నటనతో ఆకట్టుకుంది. దీంతో వరుస అవకాశాలు అందుకొన్న అనసూయ ఇటీవల తాను నటించిన 'కథనం' విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటూ సినిమా గురించి అలాగే ఇతర విషయాల గురించి మరియు భవిష్యత్తులో తాను చేయబోయే ప్రాజెక్ట్ గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చింది.


ముఖ్యంగా 'కథనం' సినిమా గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అనసూయ తెలిపింది. ఇదిలా ఉండగా అనసూయకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనే అవకాశం వచ్చిందట. కానీ ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు అనసూయ ప్రకటించింది. నా కుటుంబ సభ్యులని విడచి ఒక్క రోజు కూడా ఉండలేను. అందుకే బిగ్ బాస్ షోకు నో చెప్పాను అని అనసూయ తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: