తెలుగు సినిమా పరిశ్రమలో కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వర్మ. తను ఏది చేసినా సెన్షేషనే. సాదాసీదా విషయాన్ని కూడా కాంట్రవర్శీ చేయగల దిట్ట ఆర్జీవి. తన పదునైన మాటలు, లాజిక్ తో వేసే డైలాగులకు ఫిదా అయ్యేవారున్నారు.. పిచ్చోడు అని తిట్టే వారున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ట్రిపుల్ రైడింగ్ తో వెళ్లినవాడు వెళ్లినట్టు ఉండక సైబరాబాద్ పోలీసులను రెచ్చగొట్టి పెద్ద వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. తాజాగా మరో సంచలనానికి తెర తీశాడు వర్మ.



గత టీడీపీ ప్రభుత్వం ఆఖరి రోజుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కు అడ్డుపడటంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు వర్మ. ఎప్పుడైతే ఎన్నికల్లో వైసీపీ గెలిచిందో  అప్పటి నుంచి టీడీపీపై కౌంటర్లు వేస్తూనే వున్నాడు. వైసీపీ గెలిచిన ఆనందంలో ఆమధ్య ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీస్తున్నట్టు ట్విట్టర్లో తెలిపాడు. రెండు నెలలుగా దీనిపై ఎటువంటి చడీచప్పుడు లేకపోవడంతో దీనిపై అందరికీ ఫోకస్ తగ్గిపోయింది. కానీ చెప్పింది చేసి చూపించే వర్మ దీనిపై తాజాగా ట్వీట్ చేసి ప్రకంపనలు సృష్టించాడు. ఆగష్టు9న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాకుండా.. “కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ఏపీలో నేటి వాస్తవిక పరిస్థుల ఆధారంగా భవిష్యత్తు ఎలా ఉండబోతుందోననే కథతో ఉంటుంది. ఈ సినిమా ఏమాత్రం వివాదాస్పదమైనది కాదని సీబీఎన్ మీద ఒట్టేసి చెబుతున్నా”నంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

 


ఈ ట్విట్లర్ పోస్ట్ తో మళ్లీ వర్మ ఏదో చేయబోతున్నాడని గుసగుసలు మొదలయ్యాయి. ఈ పాట ఎటువంటి సంచలనాలకు తెర తీస్తుందోనని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. వర్మ ఏం చేశాడో, చేయబోతున్నాడో తెలియాలంటే ఆ పాట రిలీజ్ కావాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: