బిగ్ బాస్ సీజన్ 3 నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. 3వ వారంలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ సీజన్ 3 షోకి కావాల్సినంత స్టఫ్ ఇస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ ఇచ్చే ప్రతి టాస్క్ లో ఏదో ఒక సంఘటన హైలెట్ అవుతూ వస్తుంది. రెండు రోజులుగా జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ లో శ్రీముఖి చేసిన పనికి మరో ఇంటి సభ్యుడు రవి కృష్ణ చేతికి గాయమైంది.   


అందువల్ల ఆ టాస్క్ ను ఆపేశాడు బిగ్ బాస్. గురువారం ఎపిసోడ్ లో ఆలి రెజా, పునర్నవిలకు ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వారిని ఓ సీక్రెట్ రూం లోకి తీసుకెళ్లి ఉంచాడు. ఇంటి సభ్యులు గురువారం ఉదయం చూస్తే ఇంట్లో వారిద్దరు మిస్సయ్యారని గుర్తిస్తారు. బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా వారిద్దరిని ఎక్కడికో పంపించారని అనుకున్నారు.


అయితే వారిని మళ్లీ ఇంట్లోకి రప్పించాలని అంటే ఇంటి సభ్యులు కొన్నిటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఓ వారం పాటు ఇంట్లో వాళ్లెవరు చెప్పులు వేసుకోకూడదు.. ఈ వారం మొత్తం పెరుగు తినకూడదు. ఈ రెండు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఇంటి సభ్యులు దీనిపై డిస్కషన్స్ మొదలుపెట్టారు. 


హిమజ అయితే వాళ్లిద్దరు రాకపోయినా సరే పర్వాలేదని డైరెక్ట్ గా చెప్పేసింది. శ్రీముఖి కూడా చెప్పులు లేకుండా కష్టమని అన్నది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి. ఒకేసారి ఇంటి సభ్యులలో ఇద్దరు ఆలి, పునర్నవిలు మిస్ అయ్యే సరికి ఇంట్లో వారందరు షాక్ అయ్యారు. ఇక ఈరోజు వచ్చే ఎపిసోడ్ ప్రోమోలో వరుణ్ సందేశ్ కెప్టెన్ అయ్యుండి కూడా ఇంటి నియమాలను పాటించలేదని. అతన్ని ఈ సీజన్ మొత్తం కెప్టెన్ అయ్యే అర్హత కోల్పోయినట్టు ప్రకటించాడు బిగ్ బాస్. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: