కియారా అద్వానీ భరత్ అనే నేను సినిమాలో మహేష్ తో బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చింది.  సినిమా మంచి విజయం సాధించింది.  ఆ తరువాత చరణ్ తో చేసిన వినయ విధేయ రామ ఫెయిల్ కావడంతో తెలుగుకు దూరం అయ్యింది.  ఆ సినిమా హిట్టయ్యి ఉంటె కెరీర్ మరోలా ఉండేది.  ఒక సినిమా విజయం.. మరో సినిమా ఫెయిల్ కావడంతో తిరిగి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. బాలీవుడ్ కి వెళ్లిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన కబీర్ సింగ్ సినిమాలో నటించింది.  



ఈ ఏడాది బాలీవుడ్ లో టాప్ గ్రాసింగ్ సినిమాగా నిలిచింది కబీర్ సింగ్.  దాదాపుగా రూ. 290 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  ఈ మూవీ విజయం తరువాత ఆమెకు బాలీవుడ్ లో వరసగా ఆఫర్లు వస్తున్నాయి.  కరణ్ జోహార్ నిర్మిస్తున్న రెండు సినిమాల్లో హీరోయిన్ గా తీసుకున్నారు.  ఇప్పుడు ఆమెకు మరో బంపర్ అఫర్ వచ్చింది.  కోలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నది కియారా.  



ప్రస్తుతం తలపతి విజయ్ బిజిల్ సినిమా చేస్తున్నారు.  ఈ మూవీ దాదాపుగా కంప్లీట్ కావొచ్చింది.  అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు.  దీపావళి రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా తరువాత విజయ్.. కానగరాజ్ తో సినిమా చేయబోతున్నారు.  తెలుగులో సందీప్ కిషన్ తో నగరం సినిమా చేశాడు కానగరాజ్.  ఆ సినిమా తెలుగులో కంటే తమిళంలోనే బాగా ఆడింది.  కానగరాజ్ చెప్పిన కథ విజయ్ కు నచ్చడంతో సినిమా సెట్ అయ్యింది.  



ఇందులో హీరోయిన్ కోసం అనేక పేర్లు వినిపించాయి.  రష్మిక, సాయి పల్లవి ఇలా అనేక పేర్లు వినిపించాయి.  అయితే, చివరకు కియారాను తీసుకున్నారని సమాచారం.  కియారా అద్వాని ఇందులో నటించేందుకు ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది.  అనతికాలంలో సౌత్ లో రెండు సినిమా ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ కొట్టేసింది.  బిజిల్ పూర్తికాగానే విజయ్ సినిమా స్టార్ట్ అవుతుంది.  ఎలాగో తెలుగులో కూడా రెండు సినిమాలు చేసింది కాబట్టి, ముచ్చటగా మూడో సినిమా అఫర్ ఎవరినుంచి వస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: