ఒకానొక సమయంలో దక్షిణాది సినిమా రంగంలో స్టార్ హీరోలందరితో నటించిన హీరోయిన్ టాబు మళ్లీ చాలా కాలం తరువాత దక్షిణాది వైపు అందులోనూ టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా చేయడానికి ఓకే చెప్పింది. గతంలో టాబు కి అనేక ఆఫర్స్ సౌత్ నుండి వచ్చినా కానీ రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల టాలీవుడ్ కథలు రీమేక్ చేసి చేస్తున్న సినిమాలు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఏమనుకుందో ఏమో గాని టాలీవుడ్ ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండటంతో తాజాగా గత కొంత కాలం నుండి టబు దగ్గరికి వస్తున్న తెలుగు దర్శకులకు అవకాశాలకు గతంలో మాదిరిగా నో చెప్పటం లేదు. ఇదిలా ఉండగా తాజాగా టాబు  ముందుగా సినిమాకి ఒప్పుకుని తర్వాత సినిమా చేయనని టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలకు షాక్ ఇచ్చింది టాబు. దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.


ఆ సినిమా మరెవరో కాదు దగ్గుబాటి రానా హీరోగా చేస్తున్న సినిమా విరాటపర్వం. ఈ సినిమాలో రానా పక్కన హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుండగా ఒక స్పెషల్ పాత్రలో టబు ఒప్పుకోవడం జరిగింది. అయితే మరి కొద్ది రోజుల్లో ఆ సినిమాకి సంబంధించిన పాత్రల్లో షూటింగ్లో పాల్గొనాల్సి ఉండగా ఒక్కసారిగా సినిమా చేయటం లేదని ఎవరు ఊహించని విధంగా సినిమా యూనిట్ కి సమాచారం టాబు ఇచ్చిందట. అయితే దీనంతటికి కారణం డేట్స్ కుదరక పోవడం అని తెలుస్తోంది.


మొన్నటి దాకా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీబిజీగా ఉన్న టాబు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలో మరో పక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలలో నటించాల్సి ఉండగా సినిమాకి సంబంధించి అడ్వాన్స్ కూడా తీసుకోవడంతో రాణా సినిమా కి టాబు నో చెప్పినట్లు డేట్స్ మరియు టైం కుదరకపోవడం వల్ల టాబు ఈ ప్రాజెక్టు వదిలినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ వేణు ఉడుగుల టాబు పాత్రలో నందితా దాస్ అనే నేషనల్ అవార్డు విన్నర్ ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: