పూరి జగన్నాధ్ బెస్ట్ హిట్ ఇవ్వడం కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు.  ఎట్టకేలకు పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బెస్ట్ సినిమా ఇచ్చాడు.  దాదాపు అరడజను ప్లాప్స్ తరువాత ఇస్మార్ట్ శంకర్  హిట్ వచ్చింది.  ఈ హిట్ తో పూరి మరలా వార్తల్లోకి వచ్చాడు.  సినిమా ఫస్ట్ డే తరువాత ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.  



ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అంటే రామ్ తోనే చేస్తాడు కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు.  అస్లు చిక్కాల ఏంటి అంటే.. పూరి నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నారు అన్నది.  పూరి ఎప్పటి నుంచో జనగణమన సినిమా చేయాలని అనుకుంటున్నాడు.  ఇప్పటి వరకు సాధ్యం కాలేదు.  మహేష్ బాబుతో సినిమా చేయాలని అనుకున్న కుదరలేదు.  మహేష్ తో పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు చేశాడు.  ఈ రెండు మంచి హిట్స్ వచ్చాయి.  



ఆ తరువాత ఎందుకో మూడో సినిమా చేయలేకపోయారు.  ఇస్మార్ట్ శంకర్ సినిమా సమయంలో పూరి చేసిన కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టాయి.  పూరి గురించి నెగెటివ్ గా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.  మహేష్ తో చేయాల్సిన కథను విజయ్ దేవరకొండ చేస్తారని వార్తలు వచ్చాయి.  విజయ్ దేవరకొండ కూడా దీనికి ఒప్పుకున్నాడని వార్తలు వచ్చాయి.  కానీ, ఇందులో నిజం లేదని తేలిపోయింది.  విజయ్ దేవరకొండను పూరి కలవలేదని, కథ గురించి మాట్లాడలేదని వార్తలు వచ్చాయి.  



పూరి జగన్నాథ్ అటు బాలకృష్ణతో సినిమా చేయాల్సి ఉన్నది.  ఇస్మార్ట్ హిట్టయితే... సినిమా చేస్తానని బాలయ్య హామీ ఇచ్చారు.  బాలయ్య హామీ ఇవ్వడంతో కథను రెడీ చేసుకున్నాడు పూరి.  త్వరలోనే బాలయ్యను కలిసి కథ చెప్తారని సమాచారం.  అయితే, ఈ సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో చూడాలి.  ప్రస్తుతం బాలకృష్ణ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.  



పూరి సినిమాకు సంబంధించి మరో వార్త కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.  పూరి జగన్నాథ్ కన్నడ హీరో యాశ్ తో సినిమా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇందులో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాలి.  పూరి అధికారికంగా సినిమా విషయాన్నీ ప్రకటించే వరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి అనడంలో సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: