ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమా విమర్శకుల మెప్పును పొందింది. ఈ సినిమా సమయంలో వైజయంతి మూవీస్ అధినేత కుమార్తె ప్రియాంక దత్ తో వివాహం జరిగింది. ఎవడె సుబ్రహ్మణ్యం సమయంలో నాగ్ అశ్విన్ తో ప్రేమలో పడింది. ఈ వివాహం తరువాత నాగ్ అశ్విన్... మహానటి సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అనేక అవార్డులను సొంతం చేసుకుంది.
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమా కోణంలో కాకుండా ఆమె పర్సనల్ జీవితంలో ఎవరికి తెలియని విషయాల గురించి ఈ సినిమా చూపించారు. సావిత్రి జీవితాన్ని కొత్తగా చూపించారు. విమర్శకుల మెప్పును పొందింది సినిమా. ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నాడు. మెచ్చుకోవడమే కాదు.. నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు.
ఈ హామీ ఇచ్చే సమయానికి మెగాస్టార్ సైరా చేస్తున్నాడు. సమయం ఉన్నది కాబట్టి నాగ్ అశ్విన్ ఓ మంచి కథను సిద్ధం చేసుకున్నారు. మెగాస్టార్ కు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకోని రెడీ చేశారు. మెగాస్టార్ కు కథ చెప్పేందుకు అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కని, కథ చెప్పేందుకు అవకాశం ఇవ్వడం లేదని నాగ్ అశ్విన్ వాపోయాడు.
పైగా సైరా సినిమా తరువాత కొరటాల శివ సినిమాకు కమిట్ కావడం.. ఆతరువాత లైన్లో త్రివిక్రమ్.. బోయపాటి వంటి దర్శకులు ఉండటంతో నాగ్ అశ్విన్ తో సినిమా లేనట్టే అని అర్ధం అవుతున్నది. దీంతో నాగ్ అశ్విన్ తన సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. హీరో ఎవరు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. డిసెంబర్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.