యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇటీవల కాలంలో ఊరమాస్ సినిమాలు లేక మొఖం వాచిపెయిన బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా మాంచి మజా ఇచ్చింది. బీ, సీ సెంటర్లలో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.
కుర్రాళ్లైతే ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నారు. అక్కడక్కడ అసభ్యకరంగా ఉన్నప్పటికీ అమ్మాయిలు కూడా ఎగబడ్డం విశేషం.
ఇక 3 వారాల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఏకంగా డబుల్ ప్రాఫిట్స్ సాధించింది. 21 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల 54 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. ఇక ఓవరాల్గా రూ.38 కోట్ల షేర్ వరల్డ్ వైడ్గా రాబట్టింది. ఇక ఈ సినిమాను రూ.18 కోట్లకు అమ్మారు. రూ.38 కోట్ల వసూళ్లు అంటే రూపాయికి రెండు రూపాయలకు పైగానే లాభం రాబట్టింది. బయ్యర్లు ఫుల్గా లాభాలు సంపాదించుకున్నారు.
ఇక నిర్మాతలకు డిజిటల్, శాటిలైట్ ఇతరత్రా ఆదాయాలు ఉండనే ఉన్నాయి. అటు గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ సినిమా 78 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. అటు పూరి జగన్నాధ్ కూడా చాన్నాళ్ల తర్వాత సక్సెస్ అందుకున్నాడు. రామ్కు నాలుగేళ్ల తర్వాత హిట్ వస్తే... పూరికి ఏకంగా ఆరు వరుస ప్లాపుల తర్వాత హిట్ వచ్చింది.
ఇక ఈ సినిమాతో నిర్మాత చార్మీ సైతం మంచి లాభాలు సొంతం చేసుకున్నారు. ఈ ఉత్సాహంతో వీళ్లిద్దరూ చకచకా లైనప్స్ రెడీ చేస్తున్నారు. రామ్ మరో మాస్ కథ కోసం ఎదురుచూస్తున్నాడు. అటు పూరి, ఏకంగా విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.