ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాలతో తిరుగులేని హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,  ప్రస్తుతం నటిస్తున్న కొత్త సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ తో హిట్ అందుకున్న సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలై ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సంపాదించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని రేపు రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. 

ఇప్పటికే ట్రైలర్ అదిరిపోతుందని, అందులోని కొన్ని ఛేజింగ్, యాక్షన్ సన్నివేశాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు గురించిన ఒక వార్త నేడు పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ని అత్యంత భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారట నిర్మాతలు. అంతేకాక ఈ ఈవెంట్ ని రామోజీ ఫిలిం సిటీ లో జరిపేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దానివలన ఫంక్షన్ కు వచ్చే ఫ్యాన్స్ కు మరియు సెలెబ్రిటీలకు ట్రాఫిక్ బెడద ఉండదని, అదీకాక అక్కడ అయితే కావలసినంత స్థలం అందుబాటులో ఉంటుందని భావించి అక్కడ నిర్వహించాలని చూస్తున్నారట. 

అయితే కొన్నాళ్ల క్రితం రిలీజయిన బాహుబలి సినిమా ఆడియో ఫంక్షన్ కూడా రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహించడం జరిగింది కాబట్టి, సాహో ఫంక్షన్ కూడా అక్కడ జరిపితే బెటర్ అని, ఆ విధంగా ఒకరకంగా బాహుబలి సక్సెస్ సెంటిమెంట్ ని ఫాలో అవ్వాలని సాహో యూనిట్ చూస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు సాహో యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: