స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ‘‘మన మహాత్ముడు’’ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాలు, 73వ స్వాత్రంత్ర దినోత్సవం సందర్బంగా రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, హైదరాబాద్ వారు "మన మహాత్ముడు" ఛాయాచిత్ర ప్రదర్శనను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటవ నెంబర్ ప్లాట్ ఫారం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శన 4 రోజుల పాటు అనగా, 10వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి గౌరవనీయులు జి. కిషన్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం జాన్ థామస్, డీఆర్ఎం  ఆనంద్ భాటియా, స్టేషన్ డైరెక్టర్  జయరాం, ఎం దేవేంద్ర, ఆర్ఓబీ డైరెక్టర్, తదితరులు పాల్గొంటున్నారు.



దక్షిణ మధ్య రైల్వే, ఎజిఎమ్, జాన్ థామస్, డివిజనల్ రైల్వే మేనేజర్, శ్రీ ఆనంద్ భాటియా, స్టేషన్ డైరెక్టర్ శ్రీ జయరాం, శ్రీ ఎం. దేవేంద్ర, డైరెక్టర్, ఆర్ఒబి, తదితరులు పాల్గొంటున్నారు. ఈ చిత్ర ప్రదర్శనలో గాంధీజీ బాల్యం నుండి జరిగిన ఘటనలకు సంబంధించిన  అరుదైన చిత్రాలను ప్రదర్శిస్తారు. గాంధీజీ బాల్యంలో చదివిన ఆల్ఫ్రెడ్ హై స్కూల్, చంపారన్ సత్యాగ్రహం, గాంధీజీ జైలు జీవితం గడిపిన ఎరవాడ జైలు, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి వాటి తో పాటు మన స్వాతంత్య్రోద్యమం యొక్క ప్రాముఖ్యతను తెలియచేసే 50కి పైగా చిత్రాలు ఇక్కడ ప్రదర్శిస్తారు. వీటితో పాటుగా 1942 నుండి 1947 వరకు జరిగిన చివరి దశ ఉద్యమంలో గాంధీజీ కీలక పాత్ర ప్రత్యేకతలను కూడా ఈ చిత్ర ప్రదర్శన తెలియ జేస్తుంది. దక్షిణ ఆఫ్రికా నుండి తిరిగి వస్తున్న గాంధీజీ, కస్తూర్బా ల అనేక అపురూప చిత్రాలు ప్రదర్శనలో ఏర్పాటు చేస్తారు. 



ఈ చిత్ర ప్రదర్శన సందర్బంగా కేంద్ర గేయ నాటక విభాగం వారి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యకమం లో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్  రాకేష్, సౌత్ సెంట్రల్ రైల్వేస్, శ్రీనివాస్ జాయింట్ జనరల్ మేనేజర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, అర్చన రేచెల్, ఎసిఎం, విజయ్ కుమార్, డాక్టర్ మానస్ కృష్ణకాంత్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్ఒబి,  ఐ. హరిబాబు, అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్ఒబి,  కోటేశ్వర్ రావు, ఎఫ్ పిఒ, ఆర్ఒబి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: