‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ స్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఎవరూ ఊహించని విధంగా భారత దేశంతో పాటు ప్రపంచ స్థాయిలో ‘బాహుబలి’ సినిమా అదిరిపోయే హిట్ అందుకోవడంతో అదే స్థాయిలో హిట్ పడాలని ప్రభాస్ ఫుల్ యాక్షన్ మూవీ ‘సాహో’ సినిమా ని సెలెక్ట్ చేశాడు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో హిట్ అందుకున్న హీరోలు చాలా వరకు  రాజమౌళి తర్వాత చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం తర్వాత మళ్లీ రాజమౌళి చేతిలో పడ్డాకే హిట్టు పడటం గమనించిన ప్రభాస్ ముందుగానే ఆ పరిస్థితి రాకుండా యాక్షన్ చిత్రాన్ని ప్రభాస్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.


గతంలో ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘చత్రపతి’ సినిమా తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేక పోయాడు. ఎట్టకేలకు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మాస్ సినిమా 'మిర్చి' తో ఆ స్థాయిలో హిట్ అందుకున్నాడు. ఇటువంటి నేపథ్యంలో ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా హీరోయిన్ అనుష్క తో కలిసి స్పెషల్ షో లో తిలకిస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే అద్భుతమైన ప్రొఫెషనల్స్ తో ఈ సినిమాలో డైరెక్టర్ సుజిత్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారట. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ పక్కన బాలీవుడ్ సంచలన హీరోయిన్ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న నేపద్యంలో ఈ సినిమా పై బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా అంచనాలు ఉన్నాయి.


'బాహుబలి' వంటి భారీ బడ్జెట్ సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీ లో రిలీజ్ చేసిన కరణ్ జోహార్ 'సాహో' సినిమాని కూడా అదే స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. యు.వి క్రియేషన్స్ సంస్థ వారు నిర్మించిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని అంటున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు. అయితే గత కొంత కాలం నుండి అనుష్క- ప్రభాస్ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న క్రమంలో చాలాసార్లు ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పినా గాని 'సాహో' సినిమా విషయంలో ఇద్దరూ కలిసి స్పెషల్ షో చూడటం పై సోషల్ మీడియాలో నెటిజన్లు మళ్లీ సేమ్ కామెంట్లు అప్పట్లో మాదిరిగానే చేస్తున్నారు. అయితే ఈ వార్త అధికారికంగా బయటకు రాలేదు గానీ ఆంగ్ల మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: