బిగ్ బాస్ లో గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రేక్షకులని ఇవి ఆకర్షిస్తున్నప్పటికీ కంటెస్టెంట్స్ మధ్య దూరం రోజు రోజుకీ పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే శ్రీముఖి, హిమజలతో పునర్నవి దూరంగా ఉంటూ వస్తుంది. ఈ ఇద్దరితో పునర్నవికి స్నేహం కుదరకపోగా శతృత్వం మరింతగా పెరగింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఈ విషయం మరోసారి ఇది బయటపడింది.


టాస్క్ లో  భాగంగా ఇంటి సభ్యుల్లో తమకు నచ్చని వ్యక్తుల గురించి చెప్పమన్నపుడు పునర్నవి వీరిద్దరి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. హిమజ ఎవరితో స్నేహంగా ఉంటున్నట్టు పునర్నవికి అనిపించడం లేదని, తను ప్రతీసారి ఏడ్వటం బాగాలేదని, ఆ ఏడుపు కూడా ఫేక్ గా అనిపిస్తుందని మండిపడింది. శ్రీముఖిని ఉద్దేశిస్తూ తను చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటుందని, శ్రీముఖి టాస్క్ లో పార్టిసిపేట్ చేసినపుడు హెల్దీ గేమ్ ఆడదని హిపోక్రాట్ అంటూ విరుచుకు పడింది.


దీంతో పునర్నవికి శ్రీముఖి, హిమజలతో పడట్లేదని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. మరో వైపు పునర్నవికి ఆ ఇద్దరిపై అంతలా కోపం పెరగడానికి కారణం కూడా లేకపోలేదు. టాస్క్ లో ఇంటి నుండి కనబడకుండా వెళ్ళిపోయిన పునర్నవి మళ్ళి ఇంట్లోకి రావాలంటే ఇంటి సభ్యులు త్యాగాలు చేయాలని చెప్పడంతో ,హిమజ ,శ్రీముఖి లు త్యాగాలు చేయడానికి ఒప్పుకోలేదు. మెజారిటీ సభ్యులు ఓకే అనడంతో అన్యమనస్కంగానే ఒప్పుకున్నారు. 


ఇవన్నీ మనసులో పెట్టుకుని పునర్నవి అలా మాట్లాడి ఉంటుందని భావిస్తున్నారు. అయితే పునర్నవికి వాళ్ళిద్దరిపై ఎటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆమె వాటిని వ్యక్తపరిచిన తీరే ఏమాత్రం బాలేదని అంటున్నారు. ఇవన్నీ గమనించి పునర్నవి తన పద్దతి మార్చుకుంటుందా? లేక  ఈ ముగ్గురి మధ్య దూరమ్ ఇలాగే కొనసాగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: