రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం సాహో యొక్క ట్రైలర్ కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నాలుగు భాషల్లో విడుదలకానుంది. ఈ ట్రైలర్ను అదే టైం కు కొన్ని థియేటర్లలో కూడా ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ అందుకు వేదిక కానుంది.
కాగా ఒక్కో జిల్లాలో ఒక్కో థియేటర్లలో ఈసినిమా ట్రైలర్ ను ప్రదర్శించనున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ , వీడియో సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో ఈ ట్రైలర్ ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. మరి వారి అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అతి త్వరలో ఈ వేడుక జరిగే తేదీని వెల్లడించనున్నారు.
'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఆమె సౌత్ లోకి ఎంట్రీ ఇస్తుంది. కాగా జాకీ ష్రాఫ్ , నిల్ నితిన్ ముఖేష్ ,మురళీ శర్మ , అరుణ్ విజయ్, మందిరా భేది తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తనిష్క్ బాఘ్చి , గురు రాంధావ సంగీతం సమకూరుస్తుండగా తమిళ సంగీత దర్శకుడు గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు30న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది.