సినిమాల్లో కామెడీ పండించిన వెటరన్ యాక్టర్ రాజేంద్రప్రాసాద్ అంటే అందరికీ ఇష్టమే. కామెడీని హీరో లెవెల్లోకి తీసుకువెళ్ళిన ఘనత ఆయనదే. రాజేంద్రుడి సినిమాలు కామెడీలో మెగాస్టార్ స్థాయిలో  ఉంటాయి. గత నాలుగు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్న ఆయన ఇపుడు క్యారెక్టర్ రోల్స్ లోనూ తన సత్తా చాటుకుంటూ వస్తున్నారు.


ఇక లేటెస్ట్ గా రాజేంద్రుడు తన హాట్ కామెంట్స్ తో మంటలు పుట్టించారు. సినీ హీరోలు సీఎంలను ఎందుకు కలవాలంటూ లా పాయింట్ ఒకటి తీశారు. సినిమా నటులు వ్యాపారవేత్తలేమీ కారని, వారు ముఖ్యమంత్రులు మారినపుడల్లా కలవడానికి అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్ సీఎం కావడం సినీ పరిశ్రమకు ఇష్టం లేదన్న వైసీపీ నేత, థర్టీ యియర్స్ ఇండస్ట్రీ ప్రుధ్వీ చేసిన కామెంట్స్ కి రాజేంద్రుడు ఇలా  రిటార్ట్ ఇచ్చారు.


సినీ నటులు  సీఎంలను కలవాలన్న రూల్ ఏదీ లేదని రాజేంద్రుడు చెప్పారు. ఈ ఈ విషయంలో ప్రుధ్వీ చేస్తున్న కామెంట్స్ ని ఆయన అడ్డంగా కొట్టి పారేశారు. తాము జగన్ని కలవాలంటే కలుస్తామని, దానికి రాజకీయాల‌కు  అసలు సంబంధం లేదని కూడా అన్నారు.  పైగా జగన్ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా అయన చెప్పారు. తాము సీఎం జగన్ అపాయింట్మెంట్ అడిగామని అన్నారు. ఆయన ఇపుడు బిజీగా ఉన్నారని, సరైన సమయంలో కలుస్తామని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.


ఇక తమకు నీళ్ళిచ్చే సీఎం దేవుడు అంటూ  కూడా రాజేంద్రుడు కామెంట్స్ చేయడం విశేషం.  మరి ఆ సీఎం ఎవరో ఆయనకే తెలియాలి. ఇదిలా ఉండగా రాజేంద్రప్రసాద్ టీడీపీ సానుభూతిపరుడు అన్నది అందరికీ తెలిసిందే. మొత్తానికి రాజేంద్రుడి కామెంట్స్ పై ప్రుధ్వీ ఇపుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.  కాగా టాలీవుడ్లో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తనకు సినిమా అవకాశాలు కూడా ఇవ్వడంలేదని ప్రుధ్వీ ఇటీవలే చెప్పిన సంగతి విషయమే. ఇపుడు ప్రుధ్వీ ఒంటరి వారు అవుతున్నారా అన్న భావన కలుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: