ఈ మద్య సినీ, టీవి రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  తెలుగు టీవీ నటుడు  మధుప్రకాష్ భార్య భారతి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మరువక ముందే..మరో టివి నటి తన కూతురు తో సహ తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరి హృదయాలు కలచి వేస్తుంది. మరోవైపు సొంత తల్లే తన 18 ఏళ్ల కూతురిని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రాడ్న్య ఆమె కూతురు ఆత్మహత్య చేసుకున్నారా..లేక ఇతర కారణాల వల్ల ఏమైనా జరిగిందా అన్న విషయం తెలియాల్సి ఉంది.  ప్రశాంత్ పార్కర్ (43) జిమ్ కి వెళ్లాలని ఉదయాన్నే 7:30 గంటల ప్రాంతంలో  ఇంటి నుండి బయటకి వెళ్లారు. 

ఆ సమయంలో ప్రశాంత్ భార్య ప్రాడ్న్య తన కూతురురు శృతి(18)తో కలిసి ఉంది. ప్రాడ్న్య గత కొంత కాలంగా మరాఠ సీరియల్స్ లో నటిస్తుంది.  ఆమె భర్త ప్రశాంత్ పార్కర్ కొంత కాలంగా ఇంపోర్ట్ ఎక్స్ పోర్ట్ బిజినేస్ చేస్తున్నారు. అయితే కొంత కాలంగా ఆయన బిజినెస్ సరిగా నడవడం లేదు. దాంతో ప్రాడ్న్య మరాఠ సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది.  అయినా కూడా వీరి ఆర్థిక కష్టాలు తీరడం లేదని కొంత కాలంగా ఆవేదన చెందుతున్నారట.  ప్రశాంత్ పార్కర్  జిమ్ కి వెళ్లివచ్చిన తర్వాత  ఇంటి డోర్ బెల్ కొట్టగా.. ఎవరూ తీయకపోవడంతో తాళాలు పగలగొట్టి లోపాలికి వెళ్లి చూడగా.. లివింగ్ రూమ్ లో తన కూతురు చనిపోయి ఉంది.

బెడ్ రూమ్ లో తన భార్య ఫ్యాన్ కి దుప్పటితో ఉరి వేసుకొని చనిపోయి కనిపించింది. తన భార్య, కూతురు ని అలా చూడగానే షాక్ తిన్న ప్రశాంత్ పార్కర్ వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరూ చనిపోయారట.  ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంత్ పార్కర్ ని విచారించగా ఆర్థిక కష్టాలే వారి చావుకు కారణం అనే తేలిందట. బాలీవుడ్ లో రాబోతున్న 'సెక్షన్ 375' అనే సినిమాలో కూడా ఆమె ఓ పాత్ర పోషించింది. కొంతకాలంగా తమ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవడం ప్రాడ్న్య తట్టుకోలేకపోతుంది. ఆ డిప్రెషన్ లోనే కూతురిని చంపేసి తను కూడా చనిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: