జబర్దస్త్ టీవీ ప్రోగ్రాంతో దూసుకుపోతున్న హీరోయిన్లలో రేష్మి ఒకరు.  ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్నది.  గుంటూరు టాకీస్ సినిమాలో గ్లామర్ గా కనిపించి మెప్పించింది.  టీవీ, సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటున్నది.  యాక్టివ్  గా ఉండటంతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సీరియస్ గా జవాబులు చెప్తుంటుంది ఈ అమ్మడు.  



ఇటీవలే కొంతమంది అభిమానులు రేష్మిని కొన్ని రకాల అసభ్యకరమైన ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది.  దానికి తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంటుంది ఈ అమ్మడు.  దీంతో పాటు రేష్మి తన స్టైల్లో పిచ్చి రాతలు రాసేవాళ్లపై కూడా విరుచుకుపడుతుంటుంది.  అమ్మాయిల విషయంలోనే అబ్బాయిలు ఇలా పిచ్చి రాతలు రాస్తుంటారని.. అబ్బాయిల విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తించరని అంటోంది రేష్మి.  



ఇండస్ట్రీలో తనకు పేరుందని.. పబ్లిక్ ప్రొఫైల్ ఉంది కాబట్టి తను ఇలా మాట్లాడటం లేదని.. నిజంగానే అమ్మాయిలపై ఇలాంటి మగ అహంకారం ఉందని చెబుతుంది రష్మీ. ఇక నేను నీతో ఒక రాత్రి గడపాలనుకుంటున్నాను అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఫైర్ అయింది రష్మీ గౌతమ్. అసలు తానెందుకు వస్తాను.. అలా వస్తావా అని అడగటానికి సిగ్గు లేదా నీకు అంటూ రెచ్చిపోయింది. ఇలాంటివి అడగడానికి ఎంత ధైర్యం అని విరుచుకుపడింది రేష్మి.  



ఇలాంటివి తనకే కాదని, సామాన్య అమ్మాయిలు సైతం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పింది.  ఈ సమస్యలు తగ్గకపోగా ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి.  వీటిని ఎలాగైనా అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నది.  దీంతో పాటు మరికొన్ని సమస్యలను కూడా రేష్మి రైజ్ చేసింది.  సెక్స్ అన్నది ఇద్దరి వ్యక్తులకు సంబంధించిన విషయం అయినపుడు ఎందుకు అమ్మాయిని ఒక్కరినే ఇన్వాల్వ్ చేస్తారని ప్రశ్నించింది.  అబ్బాయిలను ఎందుకు ఇన్వాల్వ్ చేయరని వాపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: