స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నపీరియాడికల్ మూవీ సైరా నర్సింహారెడ్డి. ఇటీవలే ఈచిత్రం యొక్క షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 23కంపెనీలు ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ పనులను పూర్తి చేస్తున్నాయట. సినిమాను ఎలాగైనా ఆక్టోబర్ 2 న థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర యూనిట్.
ఇక ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఈ సినిమాకు సంబందించిన చిన్న మేకింగ్ వీడియో ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా సైరా టీజర్ ను మాత్రం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా బిగ్ బి అమితాబ్ బచ్చన్, చిరు కు గురువుగా నటిస్తున్నారు. వీరితోపాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , కిచ్చా సుధీప్, మిల్కీ బ్యూటీ తమన్నా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు సమకూరుస్తుండగా భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా ఈ ఏడాది మచ్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా విడుదలవుతున్న ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ప్రస్తుతం చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి సన్నద్ధం అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రస్తుతం హీరోయిన్ ను వెతికే పనిలో వున్నాడట కొరటాల శివ.