మహేందర్ ఎప్పలపల్లి, కాత్యాయనీ శర్మ హీరోహీరోయిన్లుగా వీ ఎస్ ఫణింద్ర దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ 'ట్రాప్'. ఈ చిత్రం ద్వారా అల్ల స్వర్ణలత నిర్మాతగా పరిచయమవుతున్నారు. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం ప్రీ- రిలీజ్ ఫంక్షన్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రేమకవితాలయ బ్యానేర్ లోగో ను తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ట్రాప్ చిత్ర టైటిల్ లోగోను నిర్మాత సురేష్ చౌదరి, టీజర్ ను ప్రముఖ రచయిత మోహన్ వడపట్ల విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత స్వర్ణలత మాట్లాడుతూ - " మొదట నిర్మాణ రంగంలోకి రావాలంటే చాలా భయం వేసింది. కానీ హీరో, హీరోయిన్ అలాగే టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ మంచి సపోర్ట్ అందిస్తున్నారు. అలాగే మా దర్శకుడు ఫణింద్ర ఒక సోదరుడిలా అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. నన్ను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. త్వరలో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్ కావలి" అన్నారు.
దర్శకుడు వి ఎస్ ఫణింద్ర మాట్లాడుతూ - " ఈ స్టోరీ చెప్పగానే వెంటనే నాతో సినిమా తీయడానికి ఒప్పుకున్న మా సోదరి, నిర్మాత స్వర్ణలత గారికి థాంక్స్. అలాగే మా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మాజీ గారికి కృతజ్ఞతలు. ఆయనకు సిందూరం సినిమా ఎలా మంచి పేరు తీసుకువచ్చిందో నాకు ఈ చిత్రం అలా మంచి పేరు తీసుకువస్తుంది అని నమ్ముతున్నాను. మా సినిమాలో మంచి సంగీతం తో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన ఈశ్వర్, హర్ష కు ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి ఆశీర్వాదం కావలి" అన్నారు.
హీరోయిన్ కాత్యాయనీ శర్మ మాట్లాడుతూ - " నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మంచి క్యారెక్టర్ తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది" అన్నారు.