ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో ట్రైలర్ విడుదలైంది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తుంది సాహో. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. హాలీవుడ్ సినిమా స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు!! స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటది... అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ కి సోషల్ మీడియా బ్రహ్మరథం పట్టింది. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. ముఖ్యంగా ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ యాక్షన్ సీన్స్ కు  ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఫాన్స్ ప్రత్యేకంగా థియేట్రికల్ ట్రైలర్ ను థియేటర్లలో చూసి హంగామా చేశారు. శ్రద్ధా కపూర్ తో రొమాంటిక్ సీన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. వాళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడుతున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ సినిమాలను తలపించే యాక్షన్ సన్నివేశాలు అభిమానులను అలరిస్తున్నాయి. ఈ సినిమా కోసం విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. 2 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్లో అన్ని ఎమోషన్స్ మిక్స్ చేశాడు దర్శకుడు సుజీత్. దుబాయ్, రొమేనియా లో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. వాటితో పాటు ప్రభాస్ గెటప్ కూడా అదిరిపోయింది. జిబ్రన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు అదనపు ఆకర్షణ. ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇండియన్ మూవీస్ లో ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌న‌టువంటి యాక్ష‌న్ సీన్స్ సాహోలో ఉండ‌బోతున్నాయి.  ప్ర‌భాస్ కూడా ఈ చిత్రం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. యాక్ష‌న్ సీన్స్ కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కూడా తీసుకున్నాడు. శ్ర‌ద్ధా క‌పూర్ ఈ సినిమాలో హీరోయిన్. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజ‌య్, జాకీ ష్రాఫ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆగ‌స్ట్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా సాహో విడుద‌ల కానుంది. భారీ ఖర్చుతో యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఇది పండ‌గ లాంటి సినిమా అని మాటిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. 


మరింత సమాచారం తెలుసుకోండి: