సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది సామాన్యులు ఎవరికీ చెప్పుకోలేని బాధలు చెప్పుకుంటూ ఆ బాధలు పరిష్కరించుకుంటూ ఉంటే మరోపక్క కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు ఈ ప్లాట్ ఫామ్ ని ఆసరాగా తీసుకుని ఎవరుపడితే వారిపై ఇష్టానుసారం అయిన పోస్టులు పెడుతున్నారు. కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా పోస్టులు పెడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. అలాగే చాలా మంది సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు బాధ్యతగల పదవుల్లో ఉన్న వారిపై ఇష్టానుసారంగా నోటికి పని చెబుతూ బండ బూతులు తిడుతున్నారు. ఇటువంటి తరుణంలో బుల్లితెరపై తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరచుకొన్న యాంకర్ రేష్మి కి ఒక అరుదైన ప్రశ్న సోషల్ మీడియాలో ఇటీవల నెటిజన్ వేసాడు.


ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా రేష్మి ఉంటుంది. తన షూటింగ్ విషయాల గురించి అలాగే చేయబోయే కార్యక్రమాలు గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ అలరిస్తుంటుంది. దీన్నే ఆసరాగా చేసుకుని ఒక నెటిజన్ దారుణంగా రష్మిని సోషల్ మీడియాలో ప్రశ్న వేశాడు. దీంతో సదరు నెటిజన్ పై ఓ రేంజ్ లో యాంకర్ రేష్మి ఫైర్ అయ్యింది. కొందరు పిచ్చి రాతలు రాస్తూ తనకు అసభ్యకర మెసేజీలు పెడుతున్నారని.. అయితే తాను మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాను కాబట్టి అలాంటి విషయాలు  పట్టించుకోనని చెప్పింది రష్మి.


ఆ మెసేజ్ లు తనపై పెద్దగా ప్రభావం కూడా చూపవని చెబుతోంది. ఇంతకి సదరు నెటిజన్ అడిగిన ప్రశ్న ఏమిటంటే రాత్రికి ఎంతిస్తే వస్తావ్..? ఎంత డబ్బు కావాలంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారని.. అలా అడగడానికి సిగ్గుగా లేదా..? అంటూ మండిపడింది. అలా మెసేజ్ లు పెట్టే వారి గురించి పట్టించుకోకపోయినా.. ఆ మెసేజ్ లు సమాజంలో ఎక్కిస్తున్నారని.. అలాంటి పిచ్చికుక్కల వల్లే ప్రస్తుతం అమ్మాయిలూ బాహాటంగా మాట్లాడలేకపోతున్నారని రష్మి సదరు నెటిజన్ పై ఫుల్ గా సీరియస్ అయిపోయింది. మొత్తం మీద ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: