దర్శకుడు తేజతో గోపీచంద్ అనుబంధం గురించి తెలిసిందే. జయం (2002) సినిమాతో గోపిచంద్ ని విలన్ ని చేసిన ఘనత తేజదే. ఇంకా చెప్పాలంటే తేజ గోపీచంద్ తండ్రి అయిన టి.కృష్ణకు శిష్యుడే. తేజ వర్మతో పాటు మరికొందరి దగ్గర శిష్యరికం చేశాడు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలకు టి.కృష్ణ దగ్గర కూడా వర్క్ చేశాడు. ఆ క్రమంలోనే కృష్ణ తనయుడు గోపీచంద్కు తన సినిమాల్లో కీలకమైన విలన్ రోల్స్ ఇచ్చి అతడిలోని నటనా సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు.
గోపీచంద్కు తేజ సినిమాల్లో నటించిన జయం, నిజం సినిమాల్లోని విలన్ పాత్రలతోనే మంచి పేరు వచ్చింది. నితిన్.. మహేష్ సినిమాల్లో విలన్ గా అతడి నటనకు జనం నీరాజనాలు పలికారు. అయితే ఆ తర్వాత గోపీచంద్ హీరోగా బిజీ కావడంతో వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా రాలేదు. మళ్లీ చాలా రోజులకు ఈ కాంబినేషన్ రిపీటవుతోందని తెలుస్తోంది.
దాదాపు 16 ఏళ్ల తర్వాత తిరిగి గోపీతో ఓ యాక్షన్ సినిమా ప్లాన్ చేసేందుకు తేజ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్క్రిఫ్ట్ ఇప్పటికే కంప్లీట్ అయ్యిందని.. తేజ - గోపీ సిట్టింగ్ కూడా వేశారని... గోపీ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టే తేజ స్క్రిఫ్ట్ రెడీ చేశారని అంటున్నారు. ఈ సినిమాని ఎవరు నిర్మిస్తారు అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.
ఇక గోపీచంద్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ తిరు దర్శకత్వం వహిస్తోన్న ఓ భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే గోపీ - తేజ సినిమా సెట్స్మీదకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తోన్న వీరిద్దరి కాంబో సినిమా ఎలా ఉంటుందో ? చూడాలి.