బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్న అక్కినేని నాగార్జున శనివారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చుక్కలు చూపించాడు. ఇంటి సభ్యులు చేసిన తప్పుల్ని చెప్పి ఒక్కొక్కరినీ మందలించాడు నాగార్జున. సీరియల్ నటుడు అలీ రేజాతో 21 గుంజీలు తీయించాడు నాగార్జున. వయస్సు వచ్చిన వాళ్ళు తప్పు చేస్తే గుంజీలు తీయించాల్సిందేనని నాగార్జున ఇంటిసభ్యులతో చెప్పాడు. నీకు డ్రస్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ లేదని ఏకంగా ఆడపిల్ల జేబులో చేయి పెట్టి డబ్బులు లాక్కున్నావని అలా చేయాల్సిన అవసరం ఏముందని అలీని ప్రశ్నించాడు నాగార్జున. 
 
హిమజ అలీ రేజా నాకు సమయం ఇవ్వలేదని సమయం ఇస్తే నేను డబ్బులు ఇచ్చేదానినని నాగార్జునతో చెప్పగా అలీ రేజా 100 రుపాయలు ఇవ్వాలని ముందే అడిగానని చెబుతాడు. ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రిని రవికృష్ణ విషయంలో ప్రవర్తన గురించి ప్రశ్నించాడు నాగార్జున. శివ జ్యోతితో జర్నలిజం గురించి ఎందుకు అలా అన్నావని ప్రశ్నించాడు నాగార్జున. ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి తల దించుకొని శివజ్యోతి గారికి, జర్నలిస్టులందరికీ సారీ చెబుతుంది . ఒకసారి ఎవరినైనా ఏమైనా అనేముందు ఆలోచించి అనమని తమన్నా సింహాద్రికి నాగార్జున సూచిస్తాడు. 
 
బిగ్ బాస్ హౌస్లో ప్రాపర్టీ ఏదీ పగలగొట్టకూడదని రవికృష్ణకు చెబుతాడు నాగార్జున. వితికను ఉద్దేశించి డబ్బులు దాచిన తరువాత రవికృష్ణ మీద కేర్ చూపిస్తావా అని నాగార్జున ప్రశ్నిస్తాడు. వితిక తనకు అంత పెద్ద గాయం అయిందని తెలియదని నాగార్జునకు బదులిస్తుంది. రాహుల్ శ్రీముఖిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటంపై అలా మాట్లాడవద్దని వార్నింగ్ ఇస్తాడు నాగార్జున. మహేశ్ విట్టాను ఎందుకు దొంగలకు సలహా ఇచ్చావని నాగార్జున అడగగా కెప్టెన్సీ టాస్కులో గెలవటం కోసం దొంగలకు సలహానిచ్చానని చెబుతాడు మహేశ్ విట్టా. నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ఐదుగురు ఇంటి సభ్యులలో ఎవరినీ సేవ్ చేయలేదు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈరోజు తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 
 
 
 
 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: