ఈ ఏడాది ప్రారంభంలో ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ కు ఈ చిత్రం గట్టి షాక్ ఇచ్చింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ సినిమాల జాబితాలో చేరిపోయింది. ఇక ఈ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న బాలయ్య ఎట్టకేలకు తన తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేసాడు. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ తో ప్రస్తుతం బాలయ్య ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు 'రూలర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ థాయిలాండ్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రంలో బాలయ్య కు జోడిగా సోనాల్ చౌహన్ , వేదిక నటించనున్నారు. కాగా సీనియర్ నటి భూమిక చావ్లా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. రూలర్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భూమిక కనిపించనుందట. ఆమె పాత్రా సినిమా కు కీలకం కానుంది. సి కళ్యాణ్ నిర్మించనున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి విడుదలకానుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతం అందింస్తున్నాడు . ఇక కె ఎస్ రవి కుమార్ , బాలకృష్ణ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన 'జై సింహ' గత ఏడాది జనవరిలో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. దాంతో రూలర్ ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బాలకృష్ణ ఈ చిత్రం తరువాత మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటించే అవకాశాలు వున్నాయి. నిజానికి మహానాయకుడు తరువాత బాలయ్య , బోయపాటి శ్రీను తోనే సినిమా చేయాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల రూలర్ చిత్రాన్ని మొదలుపెట్టాడు.