ఈ ఏడాది  ప్రారంభంలో ఎన్టీఆర్ బయోపిక్ తో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన  నందమూరి నటసింహం బాలకృష్ణ కు ఈ చిత్రం గట్టి షాక్ ఇచ్చింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ సినిమాల జాబితాలో చేరిపోయింది. ఇక ఈ సినిమా  తరువాత  చాలా గ్యాప్ తీసుకున్న బాలయ్య  ఎట్టకేలకు తన తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేసాడు.  ప్రముఖ సీనియర్ డైరెక్టర్  కె ఎస్ రవికుమార్ తో ప్రస్తుతం  బాలయ్య ఓ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాకు 'రూలర్' అనే టైటిల్ ను  ఫిక్స్ చేశారు.  ఇక ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్  థాయిలాండ్ లో  ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో  యాక్షన్ సన్నివేశాలను  తెరకెక్కించనున్నారు. 


హై  వోల్టేజ్ యాక్షన్  ఎంటర్ టైనర్ గా రానున్న  ఈ చిత్రంలో బాలయ్య కు జోడిగా  సోనాల్ చౌహన్ , వేదిక నటించనున్నారు.  కాగా సీనియర్ నటి  భూమిక  చావ్లా  ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని సమాచారం.  రూలర్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భూమిక కనిపించనుందట. ఆమె పాత్రా సినిమా కు కీలకం కానుంది.  సి కళ్యాణ్ నిర్మించనున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి విడుదలకానుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతం అందింస్తున్నాడు . ఇక కె ఎస్ రవి కుమార్ , బాలకృష్ణ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన  'జై సింహ' గత ఏడాది జనవరిలో విడుదలై  మంచి వసూళ్లను రాబట్టింది. దాంతో రూలర్ ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  ఇక బాలకృష్ణ ఈ చిత్రం తరువాత మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటించే అవకాశాలు వున్నాయి. నిజానికి మహానాయకుడు తరువాత బాలయ్య , బోయపాటి శ్రీను తోనే సినిమా చేయాల్సింది.  కానీ అనివార్య కారణాల వల్ల రూలర్ చిత్రాన్ని మొదలుపెట్టాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: