మహానటి చిత్రానికి గాను ఇటీవల ఉత్తమ నటి విభాగంలో జాతీయ అవార్డు ను గెలుచుకున్న రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఫై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక ఈ అవార్డు తో కీర్తి ఆనందానికి అవధులు లేవు. కాగా తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కీర్తి సురేష్ తన తదుపరి చిత్రాన్ని పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు నిర్మించనున్నాడని వెల్లడించింది. ఓ నూతన దర్శకుడు డైరెక్ట్ చేయనున్న ఈచిత్రం కూడా లేడీ ఓరియేంటేడ్ మూవీ నే కావడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలకు అలాగే హిందీలో ఓ చిత్రానికి సైన్ చేసింది. అందులో భాగంగా ఆమె ప్రస్తుతం తెలుగులో నరేంద్ర డైరెక్షన్ లో ఓ లేడీ ఓరియెంట్డ్ మూవీ లో నటిస్తుండగా .. ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ లో విడుదలకానుంది. ఈ సినిమాతోపాటూ కీర్తి నగేష్ కుకునూరు డైరెక్షన్లో ఓ స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తుందిఆదిపినిశెట్టి మరో లీడ్ రోల్ లో నటిస్తుండగా జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఇక వీటితోపాటు హిందీలో అజయ్ దేవగన్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కీర్తి సురేష్. బడాయి హో ఫేమ్ అమిత్ శర్మ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించనున్న ఈ చిత్రం అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా కీర్తి కి బాలీవుడ్ లో ఇదే మొదటి చిత్రం కానుంది.