బుల్లితెర యాంకర్లలో మొదటి స్థానంలో ఉన్న సుమ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నవారు అనసూయ, రష్మీ. వీరిద్దరు "జబర్దస్త్" షో ద్వారా చాలా పాపులర్ అయ్యారు.  అటు యాంకరింగ్ చేస్తునే ఇటు సినిమాల్లో కూడా అడుగు పెట్టారు. అయితే కాలం కలిసి రాక విజయాలు అందుకోలేకపోతున్నారు. రష్మీ ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన చెప్పుకోదగ్గ పాత్రలు ఒక్కటి కూడా లేవు. ఇటీవల ఈ ఇద్దరు యాంకర్లు నటించిన సినిమాలు విడుదల అయ్యాయి. 


రష్మీ, నందు, ధనరాజ్, ఢిల్లీ రాజేశ్వరి ప్రధాన పాత్రధారులుగా, నల్లా స్వామి సమర్పణలో, యూ అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, ఎ.పద్మనాభ రెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు నిర్మించిన సినిమా ‘శివరంజని'. హారర్ కమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకి నాగ ప్రభాకర్ దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. అసలు సినిమా వచ్చిందో లేదో కూడా తెలియదు. దీంతో రష్మీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 


ఇక అనసూయ విషయానికి వస్తే, "కథనం" పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నట్టు అనిపించింది. ఇందులో ఆమె రైటర్ పాత్ర‌లో న‌టిస్తుంది. తను రాసే కథలోలాగే బయట కూడా జరగడమే ఈ కథలోని కాన్సెప్ట్. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  కానీ సినిమా విడుదల అయ్యాక ప్రేక్షకుల నుండి సరైన స్పందన లభించలేదు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అనసూయ ఫలితం చూసి డీలా పడిపోయింది. 


క్షణం సినిమా ద్వారా తెలుగు సినిమాలోకి అడుగు పెట్టిన అనసూయకి "రంగస్థలం" లోని రంగమ్మత్త పాత్ర మంచి పేరును తెచ్చి పెట్టింది. కానీ లీడ్ రోల్ చేసిన కథనం మాత్రం బెడిసి కొట్టింది.  ఇలా వీరిద్దరు బుల్లితెర మీద ఎంత పేరు సంపాదించినప్పటికీ, వెండితెర మీద ప్రేక్షకులని ఆకట్టుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: