నిన్న ముంబాయిలో జరిగిన ‘సాహో’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో ప్రభాస్ బాలీవుడ్ మీడియాలో సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అని వార్తలు వస్తున్నాయి. అనేకమంది నేషనల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రభాస్ ను హిందీలో మాట్లాడమని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. 

దీనితో ప్రభాస్ తనకు హిందీ రాదు అంటూ చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడటం కొనసాగించాడు. అయితే నేషనల్ మీడియా ప్రతినిధులు ప్రభాస్ వంక చూస్తూ కొద్దిసేపు అయినా హిందీలో మాట్లాడమని పట్టుపట్టడంతో ప్రభాస్ నవ్వుతూ ‘జైహింద్’ అన్న స్లోగన్ ఇచ్చి తిరిగి తన స్పీచ్ ని ఇంగ్లీష్ లో కొనసాగించాడు. 

అయితే ఈ విషయాన్ని చాల సెటైరికల్ గా మార్చి బాలీవుడ్ మీడియా ప్రభాస్ పై జోక్స్ వేస్తూ కామెంట్స్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే నిన్న జరిగిన ఈమీడియా సమావేశంలో పాల్గొన్న ఒక లేడీ జర్నలిస్ట్ ప్రభాస్ ను ఒక విచిత్రమైన ప్రశ్నతో ఇరుకున పెట్టడానికి ప్రయత్నించింది. 

సల్మాన్ షారూఖ్ అమీర్ ఖాన్ లకు మీరు పోటీ ఇవ్వగలరా అంటూ ఆ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించగానే ప్రభాస్ నవ్వుతూ ‘మేడమ్ ఈ మీడియా మీట్ నుండి వెళ్ళిపోమంటారా’ అంటూ సెటైర్ వేసాడు. ప్రభాస్ తెలివిగా బాలీవుడ్ మీడియా దాడిని ఎదుర్కున్నా హిందీ విషయంలో తడబాటు పడటంతో ప్రభాస్ పై బాలీవుడ్ మీడియాలో చాల ఎక్కువగా సెటైర్లు పేలుతున్నాయి. అయితే ఇది అంతా ఒక తెలుగు హీరో బాలీవుడ్ ను షేక్ చేయబోతూ ఉండటం చూసి ఈర్ష్యతో జరుగుతున్న విష ప్రచారం అంటూ ప్రభాస్ సన్నిహితులు బాలీవుడ్ మీడియా కామెంట్స్ ను లైట్ గా తీసుకుంటున్నారు. ‘సాహో’ తో బాలీవుడ్ ను షేక్ చేయాలి అనుకున్న ప్రభాస్ హిందీని నేర్చుకోవాలని గట్టిగా ప్రయత్నించినా పూర్తిగా ఆ విషయంలో పట్టు సంపాదించలేక పోవడంతో ఈ సమస్యలు వస్తున్నాయి అనుకోవాలి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: