టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిరుత సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, తొలి సినిమాలోని తన నటనతో మెగా ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎంతో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తరువాత ఆయన, రాజమౌళి గారి దర్శకత్వంలో నటించిన మగధీర సినిమా అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచి చరణ్ కు మంచి పేరు తీసుకువచ్చింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకు పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ఫ్యాన్స్ ని మెప్పించిన చరణ్, 

ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలోని చిట్టి బాబు పాత్రలో నటించి అత్యద్భుతమైన పేరు సంపాదించారు. ఇక సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ ని సాధించడంతో చరణ్ కు అది మరింత కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇకపోతే గత ఏడాది మార్చి 30న రిలీజయిన ఆ సినిమాలోని చరణ్ నటనకు గాను అతడికి తప్పకుండా పలు పెద్ద అవార్డులు వచ్చితీరుతాయి అని అందరూ అనుకున్నారు. అయితే మొన్న ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో రంగస్థలం సినిమాకు కేవలం బెస్ట్ మిక్స్డ్ ట్రాక్ విభాగంలో మాత్రమే అవార్డు దక్కడంతో చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఢీలా పడ్డారు. 

ఇక నిన్న జరిగిన సాక్షి వారి ఎక్సలెన్స్ అవార్డుల్లో భాగంగా రంగస్థలం సినిమాలోని చిట్టి బాబు పాత్రకు గాను రామ్ చరణ్ కు ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తూ సాక్షి మీడియా గ్రూప్ వారికి తమ హీరో తరపున కృతజ్ఞతలు తెల్పుతూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆనందోత్సాహాలతో కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేవలం ఈ ఒక్క అవార్డు మాత్రమే కాదని, రాబోయే రోజుల్లో రంగస్థలం సినిమాకు సంబంధించి మరిన్ని బెస్ట్ యాక్టర్ అవార్డులు చరణ్ గెలుచుకుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడవలసిందే......!!


మరింత సమాచారం తెలుసుకోండి: