టాలీవుడ్  యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా గ్రాండ్ గా ప్రారంభించాడు. ఆయన చేసిన గరుడ వేగ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గానూ మంచి విజయాన్ని దక్కించుకుంది. అయితే ఈ సినిమా తరువాత జోరు మీద ఉన్న రాజశేఖర్ "అ!" సినిమా ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో "కల్కి" లో నటించాడు. ఈ సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, డబ్బులు మాత్రం కలెక్ట్ చేయలేకపోయింది.


దీంతో కొంచెం డిస్టర్బ్ అయిన రాజశేఖర్ తన తర్వాతి ప్రాజెక్టుని ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్నాడు.  గతంలో మాదిరిగా వరుస పెట్టి సినిమాలు చేయకుండా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథలు వింటున్నప్పటికీ వాటిని ఓకే చేయడంలో ఆలస్యం చేస్తున్నాడు.దీనికితోడు, ఆయన చిన్న కుమార్తె శివాత్మక - ఆనంద్ దేవరకొండ నటించిన 'దొరసాని' విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం రాజశేఖర్ చాలా శ్రమించారు.


అయితే తాజాగా వచ్చిన ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. రాజశేఖర్ ఈ సారి రీమేక్ చిత్రాన్ని  నమ్ముకుంటున్నాడట. ఆల్రెడీ  హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. కన్నడ లో హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. దీని కోసం చర్చలు జరిగాయని సమాచారం. రీమేక్ చేయడం వల్ల ఎంతో కొంత సేఫ్టీ ఉంటుందని భావిస్తున్నాడట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.



 తమిళ నిర్మాత ధనుంజయ్ తెరకెక్కించనున్న వీటిలో తెలుగులో రాజశేఖర్, తమిళంలో సత్యరాజ్  కుమారుడు శిబి నటించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన చేయనున్నారని టాక్. మరి రీమేక్ చిత్రమైన రాజశేఖర్ కి విజయం తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: