టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించి హీరోగా మారిన శర్వానంద్ వరుస హిట్స్ సాధిస్తున్నాడు.  ఈ మద్య సాయిపల్లవితో  నటించిన ‘పడి పడి లేచే మనసు’ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా అది మాత్రం హిట్ టాక్ రాలేదు.  ఇప్పటి వరకు లవ్ స్టోరీస్ తో ఆకట్టుకున్న శర్వానంద్ ఇప్పుడు డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాఫియా నేపథ్యంలో శర్వానంద్‌ హీరోగా  సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న  చిత్రం ‘రణరంగం’. కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయన్స్ గా నటిస్తున్నారు. ఈ  సినిమా ఆగస్ట్ 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

అయితే సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో పాజిటివ్ గా దూసుకుపోతోంది. ఈ మద్య  ట్రైలర్‌ విడుదల  చేసారు. ఈ ట్రైలర్  రిలీజ్ ఈవెంట్ ని సైతం  ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి, ట్రైలర్‌ విడుదల చేశారు.  పూర్తి గా మాస్ లుక్ లో శర్వానంద్ కనపడిన ఈ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో పాజిటివ్ గా దూసుకుపోతోంది. ఫైనల్ గా సౌండ్ కౌంట్ పేరుతో ట్రైలర్ ను కూడా వదిలారు.

చిత్ర యూనిట్ కోరిక మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. ఎన్టీఆర్ 1994లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మద్యనిషేధం విధించిన  రోజుల నేపథ్యంలో ఈ సినిమాను విశాఖ పట్నం బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కించారు.  అప్పుడున్న పరిస్దితులను ఆసరా చేసుకుని  హీరో లిక్కర్ సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడు.  తర్వాత అతని జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయి అనేదే సినిమా స్టోరీ అని సమాచారం. గతంలో కమల్ హాసన్ నాయకుడు, ప్రభాస్ ఛత్రపతి, యశ్ KGF సినిమాల నుంచి ప్రేరణ పొంది తెరకెక్కించినట్టు అర్దమవుతోంది. 

తాజాగా టీజర్ తోనే సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు స్ట్రాంగ్ గా పెరుగుతుండగా ఇప్పుడు సౌండ్ కట్ కూడా మోత మోగిస్తోంది. సౌండ్ మిక్సింగ్ తో డిఫరెంట్ మ్యాజిక్ చేశారనిపిస్తోంది. శర్వా డిఫరెంట్ లుక్స్ తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్ కి ఈ మూవీ హిట్ ఎంతో అవసరం..అలాగే కళ్యాణి ప్రియదర్శిని - కాజల్ అగర్వాల్ ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: