యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన్న సాహో సినిమా వరల్డ్ వైడ్గా ఆగస్టు 30న రిలీజ్ కానుంది. రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కావాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో చిత్ర మేకర్స్ చివరకు ఆగస్టు 30న రిలీజ్ డేట్గా లాక్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్కు అమేజింగ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర మేకర్స్ ఆనందంతో ఉబ్బితబ్బవుతున్నారు.
బాహుబలి - ది కంక్లూజన్ ట్రైలర్ 72 నిమిషాల్లో లక్ష లైక్స్ సాధిస్తే సాహో ట్రైలర్ కేవలం 28 నిమిషాల్లోనే ఈ అరుదైన ఫీట్ సాధించింది. ఇక ట్రైలర్ అన్ని భాషల్లోనూ కలిపి ఇప్పటికే రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టడంతో సాహో యూనిట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది. పలువురు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు ఇచ్చారు.
ఈ మీడియా మీట్లో ప్రభాస్ పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. సుజీత్ నాకు ఈ కథ బాహుబలికి ముందే చెప్పాడు. ప్రమోద్, వంశీ, విక్రమ్ అందరం డిస్కస్ చేసుకుని ఈ సినిమాను భారీగా చేద్దాం అనుకున్నాం. సాహో అనుకున్న దానికంటే పెద్ద స్కేల్ లో వచ్చిందని చెప్పాడు. ఇక ట్రైలర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి గారు మెసేజ్ చేశారు. వెంటనే తాను ఆయనతో ఫోన్ చేసి మాట్లాడానని.. ఆయనతో మాట్లాడడం గ్రేట్ ఫీలింగ్ అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.
ఇక సాహో ప్రమోషన్స్ ను అన్ని భాషల్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు నేపథ్య సంగీతం ఇస్తున్నారు. జిబ్రాన్ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవనుందంటున్నారు.