ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఆగస్టు నెల 30వ తేదీన విడుదల అవ్వటానికి సిద్ధంగా ఉంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇటువంటి నేపథ్యంలో 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఇటీవల సినిమా టీజర్ విడుదలైన సంగతి మనకందరికీ తెలిసినదే.


ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 'సాహో' సినిమా యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. దీంతో ప్రభాస్ 'సాహో' సినిమా గురించి మాట్లాడుతూ తన ఫ్యూచర్ లో చేయబోయే సినిమా ప్రాజెక్టుల గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఇంతకీ మీడియా సమావేశంలో ప్రభాస్ ఏమన్నాడంటే సాహో సినిమా ఇంత టైం తీసుకుంటుందని ఊహించలేదని ప్రభాస్ మాట్లాడుతూ బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కొన్ని మార్పులు చేసి క్వాలిటీ కోసం బడ్జెట్ కూడా పెంచాల్సి వచ్చింది.


కానీ నెక్స్ట్ సినిమాకు మరీ అంత సమయం తీసుకోలేను. వెంటనే రిలీజ్ చేస్తా. ఇక 100కోట్ల సినిమా చాలా ప్రెజర్ తో కూడుకున్నది. నెక్స్ట్ అంత పెద్ద బడ్జెట్ సినిమాలు చేయకుండా ఉండడానికి ట్రై చేస్తానని అన్నారు. ఇదే క్రమంలో ప్రభాస్ తన తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ...జిల్లా డైరెక్టర్ కె రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా గోపికృష్ణ బ్యానర్లో నిర్మాణం జరుగుతుందని ఇప్పటికే సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలలో నటించానని 20 రోజుల షూటింగ్ పూర్తిచేశామని ప్రభాస్ తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: