నాగార్జున హోస్టింగ్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 కి తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో గొడవలు టాస్క్ లు ప్రేక్షకులను మైమరిపిస్తున్నాయి. ఈ క్రమంలో 15 మంది ఇంటి సభ్యులలో మొట్ట మొదటి వారం బిగ్ బాస్ హౌస్ నుండి హేమా ఎలిమినేట్ అవగా ఆమె స్థానంలో వైల్డ్ కార్డు రూపంలో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చింది. అయితే హౌస్ లో ఆమె వ్యవహరించిన తీరుతో తాజాగా జరిగిన మూడవ ఎలిమినేషన్ కార్యక్రమంలో అందరూ ఊహించినట్టుగానే ఎలిమినేట్ అయ్యింది. గత వారం టీవీ9 యాంకర్ జాఫర్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం హౌస్ నుండి తమన్నా సింహాద్రి బయటకు ఎలిమినేట్ అయిన క్రమంలో ఇంటి నుండి బయటకు వస్తున్న సందర్భంలో తమన్నా సింహాద్రి ఇంటి సభ్యులతో చిందులు వేస్తున్నట్లే కనిపించినా కాస్త ఎమోషనల్ అవుతూ వెళ్లారు.


ఇక ఎలిమేనేషన్ లిస్ట్ లో మొదట పునర్నవి, వితిక, బాబా మాస్టర్, తమన్నా ఉండగా..మొదట పునర్నవి సేఫ్ జోన్ లోకి వచ్చింది. తరువాత షోకి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన కమెడియన్ వెన్నెల కిషోర్ ముగ్గురిలో ఒక కంటెస్టెంట్ ని సేవ్ చేశాడు. చివరి నిమిషం వరకు కాస్త టెన్షన్ కి గురి చేసిన వెన్నెల కిషోర్ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చి బాబా మాస్టర్ ని సేవ్ చేశారు.


ఆ తరువాత వితిక, తమన్నా ఇద్దరిలో ఒకరు ఎలిమినెట్ అయినట్లు నాగార్జున తెలిపారు. ఫైనల్ గా తమన్నా ఎలిమినెట్ అవ్వడంతో హౌజ్ కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. అయినప్పటికీ తమన్నా బయటకు నవ్వుతూనే వచ్చారు. అయితే తాజాగా తమన్నా ఎలిమినేట్ అవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పీడ విరగడయింది... అనుకున్నట్లుగానే తమన్నా అవుట్ అయ్యింది ఇంటిలో ఆమె చేసిన చేష్టలు మాటలు వినలేక పోయాము అంటూ కామెంట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: