నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ‘సాహో’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో ఊహించని విధంగా ప్రభాస్ కు మీడియా నుండి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ‘సాహో’ ట్రైలర్ లాంచ్ అయి నిన్నటికి ఒకరోజు గడిచిపోయినా రాజమౌళి స్పందించక పోవడం పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు మీడియాలో కూడ అనేక చర్చలు జరుగుతున్నాయి.

ఈ ట్రైలర్ పై టాలీవుడ్ ప్రముఖ హీరోలతో పాటు ప్రముఖ దర్శకులు కూడ ఇంకా ఇప్పటి వరకు స్పందించలేదు. ముఖ్యంగా ప్రభాస్ సన్నిహితుడు ప్రభాస్ ను ‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మార్చిన రాజమౌళి ‘సాహో’ ట్రైలర్ పై స్పందించక పోవడం అనేక చర్చలకు దారి తీసింది. 

నిన్నటి మీడియా మీట్ లో ప్రభాస్ కు రాజమౌళి మౌనంకు సంబంధించిన ప్రశ్న ఎదురు కావడంతో కొద్దిగా తడబాటుకు గురి అయినా ఆ తరువాత తెలివిగా సమాధానం ఇచ్చాడు. ‘సాహో’ ట్రైలర్ బాగుంది అంటూ రాజమౌళి తనకు ఫోన్ చేసి అభినందించాడని అదేవిధంగా మెగా స్టార్ చిరంజీవి కూడ తనకు ఈ విషయమై ఫోన్ చేసి అభినందించిన విషయాన్ని బయటపెట్టాడు. 

అయితే ప్రభాస్ కు ఫోన్ చేసి అభినందించిన రాజమౌళి ఈ విషయాన్ని తన ట్విటర్ లో ఎందుకు షేర్ చేయలేదు అంటూ ప్రభాస్ నోటివెంట ఈ సమాధానం విన్న మీడియా వర్గాలు అనేక సందేహాలలో ఉన్నాయి. వాస్తవానికి చిన్న సినిమాల పై కూడ స్పందించే రాజమౌళి తనకు అత్యంత సన్నిహితుడైన ప్రభాస్ ‘సాహో’ ట్రైలర్ విషయంలో ఎందుకు మౌనం వహించాడు అన్నది ఇండస్ట్రీలో చాలామందికి అర్ధం కాని ప్రశ్నగా మారింది. దీనికితోడు టాప్ హీరోలు కూడ ‘సాహో’ ట్రైలర్ పై ఇప్పటి వరకు స్పందించక పోవడంతో ప్రభాస్ పై కనిపించని ఈర్ష్య పెరిగి పోతోందా అని అనిపించడం సహజం..


మరింత సమాచారం తెలుసుకోండి: