శర్వానంద్ హీరోగా స్వామిరారా ఫేమ్  సుధీర్ వర్మ  దర్శకత్వంలో తెరకెక్కిన  ‘రణరంగం’ సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  కాగా తాజాగా ఈ సినిమా నుండి సౌండ్ కట్ ట్రైలర్ ను ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ విడుదల చేశారు. మొన్ననే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా కి సౌండ్ మిక్సింగ్ విభాగంలో జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.


ఈ సౌండ్ కట్ ట్రైలర్ లో పేరుకు తగ్గట్లుగానే ట్రైలర్ లో సౌండ్ కట్స్ చాలా ఎఫెక్టివ్  గా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో చాల రకాల సౌండ్స్ నేచురల్ గా అనిపిస్తూ.. అలాగే చివర్లో వచ్చే బీజియమ్ వెరీ ఇంట్రస్టింగ్ అండ్ అటెంక్షన్ సౌండ్ తో సాగుతూ.. మొత్తానికి రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు సుధీర్ వర్మ సౌండ్స్ తోనే కథలోని సోల్ ను ఎస్టాబ్లిష్ చెయ్యటం చాలా బాగుంది.


 
కాగా ఈ ట్రైలర్ ను చూస్తుంటే ‘గ్యాంగ్‌స్టర్’గా ఈ చిత్రంలో శర్వానంద్ పాత్ర శర్వా గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, ఎంతో వైవిధ్యంగానూ, ఎమోషన్స్‌తో కూడినదై ఉంటుందని అనిపిస్తోంది. ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి.


ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రత్యేకంగా సౌండ్ కట్ ట్రైలర్ ని లాంచ్ చేసారంటే, ఈ సినిమాలో సౌండ్ కి ఉన్న ప్రాధాన్యతని అర్థం చేసుకోవచ్చు. గత కొంత కాలంగా హిట్ లేని శర్వాకి ఈ సినిమా ద్వారా విజయం లభిస్తుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: